రేపు ఆంధ్రకేసరి టంగుటూరి జయంతి..


Ens Balu
3
Vizianagaram
2021-08-22 15:27:48

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆగష్టు 23 సోమవారం నాడు రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్  ఏ. సూర్యకుమారి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలోని జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి కార్యాలయాల్లో సోమవారం టంగుటూరి జయంతి వేడుకలను కోవిడ్ నిబంధనల మేరకు జరుపుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని ఆడిటోరియంలో సోమవారం ఉదయం 10-30 గంటలకు నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని అధికారులు, వారి సిబ్బంది హాజరు కావాలని పేర్కొన్నారు.