వంశీక్రిష్ణ అనేనేను శాసన మండల సభ్యునిగా..


Ens Balu
4
Visakhapatnam
2021-11-12 12:43:54

విశాఖ నగర వైఎస్సార్సీపీలో ఆయన మెరుపు..ఒక సేవ..ఒక సహాయం.. ఒక ఉద్యమం.. ఆయనే సిహెచ్.వంశీక్రిష్ణశ్రీనివాస్. వైఎస్సార్సీపీ లో పదేళ్లు అవిశ్రాంతగా కష్టపడిన ఆయనకు ఇన్నేళ్లకు శాసన మండలి పదవి వరించింది. మంచి పదవి ఇస్తానన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అనుకున్నట్టుగానే వంశీని ఎమ్మెల్సీని చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి శుక్రవారం ప్రకటించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ద్వారా ఎంపికన వారి జాబితా ప్రకటించడంతో ఒక్కసారిగా విశాఖ మహానగరంలో వంశీ అభిమానులు పండుగ చేసుకున్నారు. మా అన్న వంశీకి..జగనన్న సముచిత న్యాయం కల్పించారంటూ పండుగ చేసుకున్నారు. ఒక్క వంశీక్రిష్ణ శ్రీనివాస్ కే కాకుండా మహిళలల నుంచి వరుదు కళ్యాణిని కూడా ఎమ్మెల్సీకి ఎంపికీ చేయడంతో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు అయ్యింది. పేర్లు ప్రకటించిన తరువాత. ఇక నామినేషన్ ఆపై వంశీక్రిష్ణ శ్రీనివాస్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలింది. విశాఖ వైఎస్సార్సీపీ శిఖరంలో ఒక వెలుగు వెలగడానికి కారణం వంశీ గురువు రాజ్యసభ్య సభ్యులు విజయసాయిరెడ్డి, ఇతర శాసన సభ్యులు, మంత్రులు సహకారమేనని వంశీ ఈఎన్ఎస్ కిప్రత్యేకంగా చెప్పారు. ప్రస్తుతం వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ప్రకటించడంతో బీసీ వర్గంలో ఆనందం వ్యక్తమవుతుంది..