మొదటి 3 రౌండ్లలోనే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ భవిత


Ens Balu
210
Visakhapatnam
2023-03-16 06:48:15

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరును బట్టీ మొదటి మూడు రౌండ్లలో అభ్యర్ధి గెలుపు ఎవరనేది ఒక అంచనా వస్తుందని చెబుతు న్నారు పరిశీలికులు. గత ఎమ్మెల్సీ ఎన్నికలకు.. ఈసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకూ చాలా వ్యత్సాసం ఉండటంతో అభ్యర్ధి గెలుపుపై విశ్లేష కులు సైతం తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి అధికారపార్టీ అభ్యర్ధులు ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తారు. కానీ కానీ ఎమ్మెల్సీ ఎన్ని కలు గట్టి పోటీ మధ్య జరగడంతో నలుగురు అభ్యర్ధుల్లో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ పెరిగిపోతున్నది.  పోలింగ్ ప్రారంభం అయ్యే నాటికి నలుగురుకి మధ్య పోటీ వుంటుందనుకున్నా.. అది ముగ్గురు మధ్యే కొనసాగడం విశేషం. మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి 50% ఓట్లు వస్తే ఆఅభ్యర్ధికి గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయనే విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎన్నిక జరిగడానకి 2 రోజుల ముందే ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఇపుడు విశ్లేషకులు కూడా అదే విషయాన్ని నొక్కచెబుతుండటం విశేషం..!