జనసేన పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్..


Ens Balu
11
Guntur
2022-08-06 10:01:00

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది..ప్రధాన వ్యతిరేక పార్టీగా టిడిపి ఉన్నప్పటికీ..ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం జనసేన పార్టీలో మొదలైంది. వైఎస్సార్సీపీలో దగాపడ్డ నేతలంతా ఇపుడు ఒక్కొక్కరుగా జనసేన గూటికి చేరుకుంటున్నారు. సినీనటుడు, ఎస్సీబీసీలో కీలక పదవి పోషించిన ప్రుధ్విరాజ్ ఇపుడు జనసేనలోకి వచ్చారు. నేడో రేపో..మరో పది మంది జనసేన పార్టీ ముందుకి రావొచ్చునని సినీ వర్గాల బోగట్టా. మొన్నటి వరకూ రాజకీయం మొదలు పెట్టని జనసేనాని తాజాగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగటడ్డంతోపాటు, ఆ పని చేసే సమయంలో కలిసివచ్చే వారికోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టి ఒక్కొక్కరినీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. స్వతహాగా సినీ గ్లామరున్న జనసేనానికి ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకత్వం, వాక్ చాతుర్యం ఉన్న నాయకులు కావాలి. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి బాటలు వేస్తూనే జనంలోని సమస్యలను అదే జనానికి ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వదిలేస్తుందనే విషయాన్ని తెలియజేయడం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పెంచాలనేది జనసేన లక్ష్యంగా కనిపిస్తుంది.

సామాజిక రాజకీయ చక్రం తిరగనుందా
జనసేన ఆపరేషన్ ఆకర్ష్ లో కాపులను అగ్రభాగంలో నిలబెట్టేందుకు కార్యాచరణ జరుగుతుందని..అదే 2024 ఎన్నికల్లో కీలక భూమిక వహిస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం మొత్తం వైఎస్సార్సీపీలో ఉంటే..చౌదరి సామాజిక వర్గం టీడీపీలో ఉందని..ఎప్పుడూ ఆ రెండు సామాజిక వర్గాలే రాజ్యాధికారంలో ఉండాలా..కాపు సామాజిక వర్గానికి ఆ సత్తా లేదా అనే కోణాన్ని కూడా జన సైనికులు, ఇతర నాయకత్వం అధిష్టాంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులోభాగంగానే కాపుసామాజిక వర్గాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడగట్టడంతోపాటు.. కీలక పదవులు..అధికారంలోకి వస్తే కీలక మంత్రిత్వ శాఖలు కూడా అప్పగించాలని ఆలోచన చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర సంఘంలో ఇదే అంశాన్ని చర్చించి పలు రాజకీయ పార్టీల ముందు ఉంచితే..అందులో అగ్రభాగం జనసేన నుంచే అత్యధిక మద్దతు లభించినట్టుగా కూడా చెబుతున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలు రాజకీయంగా అధికారాన్ని అనుభిస్తే ఇక పెద్ద సామాజిక వర్గంగా వున్న మనం ఆ అవకాశాన్ని ఎందుకు దక్కించుకోకూడదు అనే సంకేతాన్ని యువత దగ్గర నుంచి నాయకత్వం వరకూ తీసుకెళుతున్నట్గుగానే కనిపిస్తోంది.

2024 ఎన్నికల్లో యువతకు పెద్దపీట..
రాష్ట్రవ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకూ జనం మధ్యలోనే ఉన్న యువతకు ఈ సారి వచ్చే ఎన్నికల్లో పెద్దపీట వేసే దిశగా కూగా జనసేన పావులు కదుపుతోంది. గతంలో చేసిన తప్పులను సరిచేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండే నేతలను ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా ప్రజలకు వెన్నుదన్నుగా వుండే పార్టీ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. ప్రస్తుతానికి బీజేపీతో మాత్రమే పొత్తు వుంటుందని ప్రకటించిన జనసేన రాబోయే రోజుల్లో మరెవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా..అనే దానిపై నేటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దానితోపాటు.. గతంలో సీట్లు ఆశింసి బంగపడి వారందరిలో యువతను గుర్తించి వారిని జనం ముందుకి తీసుకు వచ్చి వారి ద్వారానే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కూడా చూస్తోంది.

ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు వస్తారంటూ ప్రచారం
వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు కూడా జనసేన పార్టీలోకి అతి త్వరలోనే వస్తారంటూ పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూరే విధంగా ఇటీల ప్రధాన నరేంద్రమోడీ భీమవరం పర్యటనకి ఎంపీనీ రానీయకుండా చేసిన ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తూ..మీడియా ముందు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నాటి నుంచి జనసేన పార్టీలోకి రఘురామ క్రిష్ణం రాజు కూడా వచ్చి చేరుతారని... ఇదే పార్టీ నుంచి పోటీచేస్తారని చెబుతున్నారు. కానీ ఎంపీ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో రెబల్ ఎంపీగా వున్న ఆయన త్వరలోనే జనసేన తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భీమవరం ఘటన దగ్గర నుంచి ఇటు జనసైనికులు సైతం రఘురామక్రిష్ణంరాజును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు.