ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా రూటు ఎటు..?


Ens Balu
34
Amaravati
2022-09-27 01:10:37

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఓటింగ్ కీలకంగా మారుతుందా.. అధికారపార్టీ, ప్రతిపక్షంతోపాటు ఇతర పోటీ అభ్యర్ధులకు నోటా భయం అపుడే పట్టుకుందా.. అంటే అవుననే సంకేతాలు విన వస్తున్నాయి.. కల్లబొల్లి మాటలతో అప్పనంగా ఓట్లు వేయించుకొని తీరా గెలిచి శాసన మండలికి వెళ్లిన తరువాత తమకు నచ్చినట్టుగా వ్యవహరించి, ఆఖరులో పెన్షన్, ఇంటి స్థలాల కోసం రాజకీయం చేసే నేతల తేడా రాజాకీయాన్ని ఈ సారి నిరుద్యోగ పట్టభద్రులు, ఉపాధ్యాయులు గట్టిగానే ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నోటా ఓటింగ్ భారీగా పడటంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నోటాకి ఓటింగ్ గట్టిగానే పడుతుందని చెబుతున్నారు. 

ప్రస్తుతం అన్ని రకాల ఎన్నికలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన రావడం, దానికి తోడు ఎవరు ఎన్నికల్లో నిలబడి రాజకీయం చేసినా ఓట్లర్లకి ఏమీ ఒరగక పోవడంతో చైతన్యవంతులవుతున్న ఓటర్లు..ఓటు హక్కును వినియోగించుకుంటూనే దానిని ఎవరికీ పనిచేయకుండా నోటాకి వేసేందుకు సిద్ధమవుతున్నారు. శాసన మండలికి వెళ్లే పెద్దలకి ఓట్లు వేసి గెలిపించిన వారి కష్టాలు కనిపించడం లేదని, పార్టీ టిక్కెట్టుపై గెలిచినా.. ఇండిపెండెంట్ గా గెలిచినా.. చివరకు అధికారపార్టీలో విలీనం అయిపోవడం.. ఆపై ప్రశ్నించి న్యాయం చేయాలనుకున్న డిమాండ్లను పడుకోబెట్టడం కూడా ఓటర్లకు మింగుడు పడటం లేదు. దీనితో 2024 శాసన సభ ఎన్నికలకు ఏడాది ముందుగా జరిగే ఈ శాసన మండలి ఎన్నికలను జనరల్ ఎలక్షన్స్ కి రెఫరెండంగా చేయాలని కూడా చాలా మంది విద్యావంతులు కంకణం కట్టుకున్నట్టుగా సోషల్ మీడియలో ట్రోల్ అవుతున్న పోస్టులను బట్టి అర్ధమవుతున్నది. 

ముఖ్యంగా పార్టీలు నిలబెట్టే అభ్యర్ధులు ఆయా రాజకీయపార్టీలకు అనుగుణంగా పనిచేయడం, నిరుద్యోగ పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను పక్కనబెట్టి వారి పార్టీ అభవ్రుద్ధితో పాటుపడటం, వారి సొంత ఖజానాని నింపుకోవడం కూడా ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడంటే ఎలాంటి ఎన్నికలైనా రాజకీయనాయకుల గారడీ మాటలు, పార్టీ సెంటిమెంటు, అభ్యర్ధులపై ఉన్న అభిమానంతో జరిగేవి. కానీ ఈసారి జరిగే ప్రతీ ఎన్నికపై 18ఏళ్లు దాటిన ఓటరు దగ్గర నుంచి పట్టభద్రుడు, ఉపాధ్యాయుడు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సైతం ప్రభావితం చేయడంతో అన్ని వర్గాల ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని నచ్చినట్టుగా ఓటు వేస్తున్నారు.అందునా నోటా ఓటుకి ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుండటంతో అందరిలో చైతన్యం మరింత ఎక్కువవుతోంది.

సాధారణ ఎమ్మెల్యే ఎన్నికలను తలపించే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అభ్యర్ధులు ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం ఇపుడు ప్రతీ ఒక్క ఓటరు ఎంతగానో ఆలోచింప చేస్తున్నది. ఇంత మొత్తం ఖర్చుచేసి ఎన్నికల్లో టిక్కెట్టు పొంది గెలిచినవాడు..ఖర్చు పెట్టిన సొమ్ము అధికారంలో ఉండగానే రాబట్టుకోవాలని చూస్తాడు తప్పితే, ఓట్లు వేసి గెలిపించిన వారికోసం ఏం ఆలోచిస్తాడనే విషయం గత పదేళ్ల నుంచి ప్రతీ ఓటరు గమనిస్తున్న అంశం. అయితే ఇక్కడ భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటువేసే హక్కును ప్రతీ ఒక్క పౌరుడూ జనరల్ ఎన్నికలతోపాటు, పెద్దలకు సభకు ఓటు హక్కు ఉండే పట్టభద్రులు, ఉపాధ్యాయులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేసే విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సామాజిక బాధ్యతను తన బుజాలపై వేసుకుంది. ఎన్నికల సరళిని, జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఓటరు ముందుకి ప్రత్యేక కధనాలుగా తీసుకు వస్తూ వారిని చైతన్య పరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. 

ఈ నేపథ్యంలో ఈఎన్ఎన్ అందిస్తున్న వాస్తవాలు చాలా రాజకీయ పార్టీలు, డబ్బు ఖర్చుచేసి ఓట్లు వేసిన తరువాత వారికి ఏ విధంగానూ సహాయ పనడని అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇండిపెండెంట్ అభ్యరధులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులకు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రజల పక్షాన, ఓటు ఆత్మగోషను అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడంతోపాటు..అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేయడం కోసం ఏడ్చేవారి కోసం కాకుండా..ప్రజల కోసం..ఓటు వేసిన ఓటరు కోసం ఆలోచించే నిజమైన ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపించే విషయంలో తనవంతు బాధ్యతను కొనసాగిస్తున్నది. ens live app మరియు అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రోజుకో కొత్త కోణంలో ప్రజాల్లో జరుగుతున్న చర్చను ప్రత్యేక కధనాలుగా దారావాహికాన్ని అందిస్తున్నది.

 ఈ విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడి వచ్చినా, బెదిరింపులు వచ్చినా ధైర్యంగా తట్టుకొని నిలబడి ఓటరు పక్షాన నిలబడతామని, ప్రతీ ఒటరున్ని చైతన్య పరుస్తాం తప్పితే వెనుకడుగు వేసే ప్రశక్తే లేదని కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈఎన్ఎస్ అందించే ప్రత్యేక కథనాలు 100 మంది తేడా రాజకీయ నాయకులు నమ్మకపోయినా వచ్చిన నష్టమేమి లేదు. ఒక్క నిజమైన ఓటరు నమ్మితే అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతున్నట్టుగానే భావిస్తామని కూడా ధైర్యంగా ప్రకటిస్తున్నాం. అనాధిగా ఓటరుకి జరుగుతున్న అన్యాయాన్ని అదే ఓటరుకి తెలియజేయడంలో ఒక్క అడుగు ముందుకి వేస్తున్నాం. ఓ ఓటరుడా నువ్వు మేలుకోకపోతే మన బ్రతుకులు ఇలానే ఉండిపోతాయనే నగ్న సత్యాన్ని ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకొని చైతన్యవంతం అయ్యేదాక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈ తరహా చైతన్య పూరిత కథనాల పరంపర కొనసాతుందని బల్లగుద్ది మరీ తెలియజేస్తున్నాం. ఏ ఎన్నిక అయినా ఓటింగ్ శాతాన్ని పెంచడంతోపాటు..నేతల గారడీ మాటలకు మభ్యపడిపోతున్న ఓటరుడని తట్టిలేపి ఆలోచించేలా చేస్తున్నాం..చేస్తాం..చేస్తూనే ఉంటాం..!