పరిపాలన వికేంద్రీకరణతోనే అభివ్రుద్ధి సాధ్యమని..మూడు రాజధానులు కావాలనే నినా దంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమంపై అంతా చాలా పెద్ద స్థాయిలో ఊహించుకునే సమయంలో ఇదే పార్టీకి చెందిన ఎంపీ, మరో రాజ్య సభ్య సభ్యుడు భూ కబ్జాలు, గొడవులు ఆందోళనలపై ఒకరి పై ఒకరు సంచలవ్యాఖ్యలు చేస్తూ.. హాట్ టాపిక్ గా మారారు. ఒకప్పుడు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దగ్గర ముగిసిందనుకున్న పంచాయతీ సరిగా విశాఖ గర్జన కుమందు రాజుకోవడం ఇపుడు మరింత ముదిరి పాకాన పడింది. రాజ్యసభ సభ్యుడు సై సైరా అంటే..మరో ఎంపీ ఎంవీవీ తగ్గేదేలె అన్నట్టుగా మాల యుద్ధం చేసుకుంటున్నారు. విశాఖలో భూ ఆక్రమణలపై మీడియా కోడైకూస్తున్న సమయంలో వాటికి ఆజ్యం పోసేల విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, విశాఖ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డిలు ఒకరిపై ఒకరు చేస్తున్న వ్యాఖ్యలు మీడియా చేస్తున్న అక్షర సేద్యానికి మరింత ఊతాన్ని, కోత్త ఆలోచనలు, లోతైన సమాచారాన్ని ఇస్తున్నాయి.
పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే విశాఖలో కావాల్సిన భూములు తీసుకునేందుకు విజయసాయిరెడ్డి బంధువులు భూ యజమానులపై దాడులు చేయడం.. వారి భూములను 22ఏలో పెట్టి ఆ తరువాత బెదిరించి వారికి అనుకూలంగా రాయించుకోవడం వంటివి చేస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ బహిరంగంగానే ఆరోపించారు. అంతేకాదు ఒకానొక దశలో సదరు వివరాలతో ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా సిద్దమయ్యారు. కానీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ ప్రయత్నం నుంచి వెనక్కి తగ్గారు. తాను ప్రైవేటు భూముల్లో ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు చేసుకున్నాను తప్పితే ఎక్కడా ప్రభుత్వ భూమిని లాక్కోలేదన్నారు. పైగా ప్రభుత్వ భూములు కబ్జాకి గురవకుండా వ్యతిరేకంగా పోరాడమని పరోక్షంగా దసపల్లా భూములను ఉద్దేసిస్తూ ఎంవీవీ మాట్లాడటం కూడా ఇపుతు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇదే విషయంలో విశాఖలోని మీడియా కూడా రోజుకో కొత్త కథనాన్ని వెలుగులోకి తీసుకు రావడం కూడా ఎంపీలిద్దరూ చేసుకుంటున్న పరస్పర ఆరోపణలకు ఊతం ఇచ్చినట్టు అయ్యింది.
అయితే ఇక్కడ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ చేసే అన్ని ప్రాజెక్టుల్లోనూ భూ యజమానులకు ఒక్కశాతం వాటా ఇచ్చి 99శాతం వాటా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటాలు తానెక్కడా చూడలేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ తరహా వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై అటు ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ కూడా ముందు అతనికున్న మురికి వదిలించుకోమనండి. ఇతరు కోసం ఎందుకు అంటూ ఘాటుగానే స్పందించారు. వాస్తవానికి విశాఖలో విజయజసాయిరెడ్డి ఒక పెద్ద తరహాలో ప్రభుత్వంలో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ తాను ఎక్కడా తగ్గేది లేదు అంటూ ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ సైతం విజయసాయిరెడ్డిపైనే సై అంటే సై అన్నట్టుగా వ్యవహరించడం.. అదీ విశాఖ గర్జన కుమందు ఈ పంచాయతీ తారాస్థాయికి చేరుకోవడం అధిస్థానానికి తలనొప్పిలా మారింది. ఇంతకీ 15వ తేదీన చేపట్టే విశాఖ గర్జన విజయసాయిరెడ్డితోపాటు, ఎంవీవీ అతని అనుచరులు హాజరవుతారా లేదా అనేది కూడా ఇపుడు హాట్ టాపిక్ గా మారింది..!