సిబిఐకి ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యేక లేఖ


Ens Balu
8
Kadapa
2023-01-28 07:38:15

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి ప్రత్యేకంగా లేఖ రాశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. 'వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని, విచారణను పూర్తిగా రికార్డు చేసేందుకు అనుమతించాలని, నాతో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి అని లేఖలో ఎంపీ పేర్కొన్నారు.' అయితే ఈ లేఖకు సీబీఐ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ పరంగా ప్రాధాన్యత సంతరించుకుని చర్చ జరుగుతోంది. వివేకా హత్యకేసు ఇంకా నానుతూనే ఉండటం విశేషం..!