పట్టభద్రుల ఆలోచనలకు అగుణంగానే నాతొలిఅడుగు


Ens Balu
28
Visakhapatnam
2023-02-27 17:27:23

ఉత్తరాంధ్రా జిల్లాల్లోని పట్టభద్రుల ఆలోచనలకు అనుగుణంగానే నా తొలి అడుగు వేస్తానని స్వతంత్య్ర ఎమ్మెల్సీ అభ్యర్ధి ఇల్లిపిల్లి అప్పలరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టభద్రుల అభివ్రుద్ధి, వారికి ప్రయోజనాలు చేకూరలేదన్నారు. కేవలం పట్టభద్రుల అభివ్రుద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో ఈసారి ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్ధిగా తాను బరిలో నిలుచున్నట్టు చెప్పారు. ప్రతీఏటా జాబ్ కేలండర్, డిగ్రీతోపాటే సాఫ్ట్ వేర్ శిక్షణ, మూడు జిల్లాల్లో నిరుద్యోగల కోసం ప్రభుత్వ స్లడీ సెంటర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాల రద్దుకే నా తొలి ప్రాధాన్యత అన్నారు. మార్పుకోకుంటున్న పట్టభధ్రులందరూ తొలి ప్రాధాన్యతా ఓటును తనకు వేయాలని కోరారు. ఖచ్చితంగా పట్టభద్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి యువ నాయకత్వం యొక్క విలువల పెంచుతానని అప్పలరాజు చెప్పుకొచ్చారు.