నలంద కిషోర్ కరోణా మ్రుతిని రాజకీయంచేస్తే ఊరుకోం..


Ens Balu
2
Visakhapatnam
2020-07-26 12:32:38

టిడిపికి చెందిన నలంద కిషోర్ ప్రభుత్వ, పోలీసుల వేదింపుల కారణంగా మ్రుతిచెందారంటూ ఎల్లోమీడియా ద్వారా బురదచల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హితవు పలికారు. ఆదివారం విశాఖ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. నలంద కిషోర్ అనే వ్యక్తి  కరోనా లక్షణాలతో చనిపోతే దానిని రఘురామ క్రిష్ణరాజు ప్రభుత్వంపై తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసలు ఆయనెవరో రఘురామక్రిష్ణరాజుకి తెలుసా అని ప్రశ్నించారు. ఆయన కరోణాలో మ్రుతిచెండం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామే తప్పా...చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుతో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తూ ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖలో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి కొందరు టిడిపికి చెందిన మాజీ మేయర్ దొరబాబు సారధ్యంలో ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసలు అరెస్టు చేసి రెండు రోజుల్లోనే వదిలేశారని అన్నారు. తరువాత ఈ విషయాన్ని రాజకీయం చేయడానికి చంద్రబాబుతో చేతులు కలిపి విశాఖ ప్రజల్లో అబధ్రతా భావం కలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.