ఎన్నికల నియమావళి పాటించాల్సిందే..


Ens Balu
1
Nuzividu
2021-03-01 13:38:40

 మున్సిపల్ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్ధులు ఎన్నికల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని డిఎస్సీ శ్రీనివాసులు సూచించారు. సోమవారం క్రిష్ణాజిల్లా నూజివీడు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను ఎలా పాటించాలో వివరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీచేసే అందరి అభ్యర్ధులపైనా పోలీసు నిఘా వుంటుందన్నారు. ఎవరూ ఎలాంటి గొడవలకు, అల్లర్లకు పాల్పడినా అలాంటి వారిపై ఎన్నికల నిబంధనలను అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలంటే ఎన్నికల సంఘం విధించిన నియమనిబంధనలను ఖచ్చితంగా అభ్యర్ధులంతా పాటించాలన్నారు. అభ్యర్ధులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటనారాయణ, ఎస్.ఐ గణేష్ కుమార్, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు పాల్గొన్నారు.