వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న కాశీవిశ్వనాధం..


Ens Balu
0
Visakhapatnam
2021-03-04 10:54:25

ఆంధ్రప్రదేశ్ లో ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పాలనకు ముగ్ధులైన వారంతా వారి మాత్రు పార్టీలకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారని విశాఖ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీకిచెందిన సీనియర్ నాయకులు బి.కాశీవిశ్వనాధం వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా విశాఖలో ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విసారె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా జనరంజక పాలన అందిస్తున్నందునే వివిధ పార్టీల నుంచి నాయకులు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారన్నారు. చేరిన వారంతా పార్టీ అభివ్రుద్ధికి, పార్టీ నిర్ధేశించిన అభ్యర్ధులకు మద్దతు ఇస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, మంత్రులు కె.కన్నబాబు, ఎంపీ ఎంవివిసత్యన్నారాయణ, ఉత్తర నాయకులు కెకెరాజు, కంపాహనోక్, తదితరులు పాల్గొన్నారు.