డా. వైఎస్సార్ సాక్షిగా జివిఎంసీ నూతన పాలకవర్గం..


Ens Balu
1
Visakhapatnam
2021-03-18 18:41:32

విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించిన 58 మంది కార్పోరేట్లర్లంతా దివంగతనేత డా.వైఎస్సార్ కి ఒకేసారి నివాళులు అర్పించారు. గురువారం జివిఎంసీలోని మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ కేంద్ర కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిలతో కలిసి కార్పోరేటర్లంతా విఎంఆర్డీఏ పార్కులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఒక గ్రూఫ్ ఫోటోకి పోజిచ్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, దివంగత నేత ఆశీస్సులతో మీరంతా విశాఖ ప్రజలకు మంచి సేవలు చేయాలని ఆకాంక్షించారు. మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ లకు శుభాకాంక్షలు చెప్పారు. మీ పాలనపై విశాఖ ప్రజలు నమ్మకం ఆధారపడి వుంటుందన్నారు. నిరుపేద కష్టాలు తీరాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావివ్వకుండా పాలకవర్గం పరిపాలన సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవీవీ సత్యన్నారాయణ, డా.బి.సత్యవతి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉత్తర నియోజకవర్గ సమన్వకర్త కెకెరాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, మాజీ మంత్రి పి.బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.