అన్ని ప్రభుత్వశాఖలకూ ఫేస్ రికగ్నైజేషన్


Ens Balu
19
Guntur
2022-08-17 01:58:02

ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల్లోని అధికారులు, సిబ్బంది ముందుకి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వస్తుందా అంటే అవుననే సమాధానం వస్తున్నది రాష్ట్ర అధికారుల నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే అధికారులు, సిబ్బంది సమయానికి విధులకు రావాల్సి వుంటుందనే ప్రభుత్వ ఆలోచన, అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. తొలుత విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టపెట్టిన ప్రభుత్వం టైమ్ బాండ్ ఏర్పాటు చేసింది. తద్వారా ఉపాధ్యాయులంతా సరిగ్గా 9గంటలకు యాప్ లో అటెండన్స్ వేయాల్సి వుంటుంది. అలా సమయానాకి అటెండెన్సు వేయకపోతే ఆరోజు లీవుగా పరిగణిస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ ఒక్క యాప్ విషయంలో ఉపాధ్యాయులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమకు సమయపాలన పెట్టడం నచ్చలేదని ఎదురు తిరిగినా దానిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా యాప్ వినియోగాన్ని అమలు చేసింది. చచ్చినట్టు 70శాతం మంది ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను తమ మొబైల్ లో వేసుకొని అటెండెన్సు వేయాల్సి వచ్చింది. యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలనే డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువచ్చి కొంత మంది యాప్ లో అటెండెన్సు వేయకుండా ఉండిపోయారు. ఇపుడు ఈ అంశమే రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది..

పాఠాలు చెప్పకుండా మరుగు దొడ్లకు ఫోటోలు తీయాలా..
సమాజంలో ఉపాధ్యాయులంటే ఎంతో ఉన్నతమైన గౌరవం వుంది. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల యాప్స్ వలన పిల్లలకు పాఠాలు చెప్పడం మాట దేవుడెరుగు మరుగుదొడ్లు, భోజనాల వద్ద ఫోటోలు, వీడియోలు తీసేందుకే ప్రతీరోజూ విలువైన గంట సమయం వ్రుధా అవుతోందని ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ ఈ విధానమే అమలులో వుంటే ఇపుడు ప్రతీ రోజూ ఉదయం టంచనుగా 9గంటలకల్లా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేసే విధానాన్ని కూడా ఉపాధ్యాయులంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఏవేవో పనులు, కాగితాలపైనే మొత్తం పనంతా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగం అంటే సమాయానికంటే గంట ఆలస్యంగా వచ్చి.. గంట ముందుగానే ఇంటికి తిరుగు ముఖం పట్టే విధానాలకు చరమ గీతం పాడేందుకే ఈ కొత్తరకం యాప్ ని అమలులోకి తీసుకొచ్చామని చెబుతోంది ప్రభుత్వం.

నాడు-నేడుతో పాఠశాలల రూపం మారినా విద్యలో..?
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చినా..విద్యావిధానంలో మాత్రం ప్రభుత్వం అనుకున్నట్టుగా మార్పులు మాత్రం ఇంకా నోచుకోలేదు. నూతన విద్యాసంవత్సరం నుంచి సరికొత్త విద్యావిధానాలను అమలు చేయాలని చూసినా..ఇంకా ఎక్కడా ఫలితాలు మాత్రం ప్రభుత్వానికి కనిపించలేదు. దీనితో ప్రభుత్వం వ్యూహాత్మంగా తన అడుగులు వేస్తుందనే విషయం నేడు ఫేస్ రిగ్నైజేషన్ యాప్ ద్వారా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ముందుకి వచ్చినట్టుగా చెబుతున్నారు. నాడు-నేడు పథకం ద్వారా అమలు చేసిన అభివ్రుద్ధి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్నివిషయాల్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టుగానే ఉన్నట్టు కనిపిస్తోంది. టైమ్ బాండ్ యాప్ అటెండెన్సును నిరుపేద విద్యార్ధులకు నిశ్వార్ధంగా ప్రభుత్వ ఉచిత విద్యను అందించాలనుకునే ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నప్పటికీ.. ఆడుతూ, పాడుతూ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. యాప్ లు రూపొందించిన ప్రభుత్వం, వాటి వినియోగానికి సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి కూడా తీసుకెళ్లినా దానిని ప్రభుత్వం లైట్ తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుకు, ఉద్యోగులకు ఈ యాప్ వినియోగం, అమలు కాస్త కష్టంగా ఉన్నా..ప్రజల నుంచి మంచి స్పందన రవాడంతో ప్రజామోదం మేరకే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వినియోగంలోకి తేవడానికి యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. 

అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తరహా యాప్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వశాఖల్లోనూ విద్యాశాఖ తరహా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందాలని పైలట్ ప్రాజెక్టుగా ముందుగా విద్యాశాఖలోనే దీనిని ఏర్పాటు చేసింది. అయితే ఉపాధ్యాయుల నుంచి తీవ్రంగా ప్రతిఘటన ఎదురైనప్పటికీ ప్రభుత్వం మాత్రం అన్ని ప్రభుత్వశాఖల్లో ఈ తరహా యాప్ ని అమలు చేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింతగా చేరువ చేయాలని చూస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రస్తుతం అమలు చేస్తున్న యాప్ డేటా ఆధారంగా.. ఫేస్ రికగ్నైజేషన్ డేటాబేస్ కి లింక్ చేయడం ద్వారా మిగిలిన శాఖల్లో కూడా యాప్ ను వినియోగంలోకి తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. ఒకప్పటి బయో మెట్రిక్ అటెండెన్సు కంటే నేటి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన 8గంటలూ విధులు ప్రభుత్వ ఉద్యోగులు క్రమం తప్పకుండా చేయకుండా వెనుతిరిగే పరిస్థితి ఉండదు. అలా ప్రభుత్వ పనిగంటల్లో ప్రజలకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలంటే పనిచేసే చోట మాత్రమే యాప్ పనిచేసేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. చూడా ఫలితాలు రానున్న రోజుల్లో ఈ యాప్ ద్వారా మిగిలిన ప్రభుత్వ శాఖల ద్వారా ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది..!