వసతులకు అనుగుణంగానే గదుల అద్దెనిర్ణయం


Ens Balu
17
Tirumala
2023-01-07 11:25:48

తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్, నారాయణగిరి విశ్రాంతి గృహాలను భక్తుల కోరిక మేరకు ఆధునీకరించి, అక్కడి వసతులకు అనుగుణంగానే గదుల అద్దె నిర్ణయించినట్టు టిటిడి పేర్కొంది. అయితే, కొన్ని పత్రికల్లో పేర్కొన్న ట్టు గదుల అద్దె భారీగా పెంచేశారనడం వాస్తవం దూరం. ఈ విశ్రాంతి గృహాల్లో దాదాపు 30 ఏళ్ల క్రితం అప్పటి వసతులకు అనుగుణంగా గదుల అద్దెను నిర్ణయించి అదే అద్దెను వసూలు చేస్తున్నారు. అయితే, పలువురు భక్తులు  ఏసీతోపాటు అధునాతన  సౌకర్యాలు కల్పించాలని సలహాలు, సూచనలు అందించిన మేరకు టిటిడి ఈ విశ్రాంతి గృహాల్లోని గదులను ఆధునీకరించింది. భక్తుల అభిమతానుసారం నూతన ఫర్నీచర్, ఏసి, వేడి నీటి కోసం గీజర్లు తదితర వసతులు కల్పించింది.  అయితే, సదరు మీడియాలో పేర్కొన్నట్లు గదుల అద్దెను భారీగా టిటిడి పెంచిందనడం వాస్తవం కాదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.