సీఎంను కలిసిన ధార్మిక సలహాదారు చాగంటి
Ens Balu
14
Tadepalli
2023-02-16 16:44:54
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయం లో కలిసి చాగంటిని సీఎం కూడా సత్కరించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను అందజేశారు. ఆయనతో పాటు శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ డాక్టర్ కే.ఐ. వరప్రసాద్ రెడ్డి కలిశారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం చాగంటి సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.