1000 కోట్లతో మరో పరిశ్రమ 2వేల మందికి ఉపాధి


Ens Balu
23
Tadepalli
2023-02-27 16:37:55

తూర్పుగోదావరి జిల్లాలో రూ.1000 కోట్ల పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్‌ గ్లాస్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు  సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి వరుణ్‌ గుప్తా తెలియజేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎంను కలిసిన త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. దానికి అనుగుణంగా పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నాయని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ సోలార్ గ్లాస్ పరిశ్రమ ఏర్పాటైతే ఎంతోమందికి పరోక్షంగా ఉపాది లభిస్తుందని పరిశ్రమ నిర్వాహకులు తెలియజేశారు.

సిఫార్సు