జనసేన సహకారంతోనే ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ గెలుస్తాం


Ens Balu
24
Visakhapatnam
2023-03-09 10:58:58

బిజేపీ-జనసేన పొత్తుతోనే ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖలో వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపితో జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు. ఈ విషయం పదే పదే చెప్పాల్సిన పనిలేదని, జనసేన సహకారం బిజెపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణంగా ఉందన్న ఆయన ఈసారి బిజీపీ లక్షకు పైగా ఎమ్మెల్సీ ఓట్లు రిజిస్ట్రేషన్ చేయించిందన్నారు. బిజేపీ అభ్యర్ధి మాదవ్ పై పట్టభద్రులు, నిరుద్యోగులకు నమ్మకం ఉందన్న సోము 2024 ఎన్నికల్లో ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుందన్నారు. హామీలిచ్చి మడమతిప్పేసిన సీఎంను ఆంధ్రప్రదేశ్ లోనే చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు బీజేపి తెలియజేసిందన్నారు. రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరుగుతుందో ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఈసా ఎమ్మెల్సీ గెలిచేది బీజేపీనే అని నొక్కిచెప్పారు.
సిఫార్సు