ENS ఎఫెక్ట్.. ట్రాన్స్ ఫర్స్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


Ens Balu
157
Tadepalli
2023-05-17 11:29:26

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీలకు పచ్చజెండా ఊపింది. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారు, ఐదేళ్లుగా ఒకే చోట ఉన్నవారిని బదిలీలు చేస్తామని పేర్కొంది. అయితే ఈబదిలీలకు సంబంధించి ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రత్యేక జీఓలు విడుదల కాను న్నాయి. ఈనెల 22 నుంచి 31వరకూ బదిలీల ప్రక్రియ సాగనుంది. ప్రభుత్వశాఖల వారీగా ఇచ్చే బదిలీల జీఓల్లో విధి విధానాలు ప్రకటించ నున్నారు. చాలాకాలం నుంచి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరగలేదు. ఇదే విషయమై ఈఎన్ఎస్ వరుస కధనాలు ప్రచు రిస్తూ వస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన బదిలీలపై కూడా చట్టబద్ధత అడ్డు వస్తుందనే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. దీనితో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సచివాలయ సిబ్బంది విషయంలోనూ ప్రత్యేకంగా బదిలీలకు సంబంధించిన నిబంధ నలు తయారు చేయాలని సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డరెక్టర్లను ఆదేశించారు. అన్నీరూట్లు క్లియరై ఈనెల 22నుంచి బదిలీలు ప్రక్రియ ప్రారంభం కానుంది.
సిఫార్సు