ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ప్రసూతి కష్టాలు తీరనున్నాయి


Ens Balu
79
Tadepalli
2023-06-06 03:17:25

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ప్రసూతి కష్టాలు తీరే సమయం ఆశన్నమైనమైంది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన  దగ్గర నుంచి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, www.enslive.net,  ens live app ద్వారా ప్రత్యేక కధనాలను ఇదే విషయమై ప్రచురిస్తూ వస్తోంది. ప్రభుత్వం ప్రసూతి శెలవులు తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు సర్వీసు ప్రొభేషన్ గడువు కూడా పెంచుకుంటూ వచ్చింది. అదే విషయాన్ని పతాక స్థాయిలో ప్రచారం చేయడంతో, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో ఈసారి చలనం వచ్చింది. మంత్రివర్గ కమిటీలో ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాయి. దీనితో ఈ విషయాన్ని మంత్రవర్గ సమావేశంలో చర్చిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మహిళా ఉద్యోగులకు ఇచ్చే 6నెలల ప్రసూతి శెలవులను అడ్డం పెట్టుకొని, నూతనంగా ఉద్యోగాల్లో చేరిన వారి ప్రొభేషన్ గడువు మరో ఆరు నెలలు పెంచడంతో వారి రెగ్యులర్ పేస్కేలు నష్టపోతున్నారని, అదే సమయంలో వారికి వచ్చే పదోన్నతులు కూడా మరో 6నెలలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఈఎన్ఎస్ లైవ్ యాప్ కథనాలతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో చైతన్యం తీసుకు వచ్చింది.

కొత్త పీఆర్సీ, బకాయి డిఏలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషన్ తదితర విషయాలపై మంత్రవర్గంతో సమావేశమైన ఉద్యోగ సంఘాలు ప్రసూతి శెలువులు, సర్వీసు ప్రొబేషన్ గడువు పెంచడం, కొన్ని చోట్ల, ఆరు నెలలు దాటిన తరువాత శెలవుల బిల్లులకి జిల్లా కార్యాలయాల చుట్టూ తిప్పే కంటే..శెలవులు ఇచ్చే సమయంలోనే జీతం మంజూరు చేయాలని, ప్రభుత్వం ఇచ్చే శెలవులను సర్వీసు ప్రొభేషన్ కు లింకు పెట్టకూడదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీనితో దిగివచ్చిన ప్రభుత్వం ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఉద్యోగ సంఘాలు డిమాండ్ పరిగణలోకి తీసుకుంటే మహిళా ఉద్యోగులకు ప్రసూతి కష్టాలు తీరిపోనున్నాయి. ప్రసూతి శెలవుల విషయం ప్రభుత్వం ద్రష్టికి వెళ్లడానికి  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, www.enslive.net,  ens live app ప్రత్యేక కథనాలు ఎంతో దోహదం చేశాయని, సదరు వార్తలు చూసిన ఉద్యోగులు విశాఖలోని న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్లు చేసిన ధన్యవాదములు తెలియజేశారు. 

ప్రభుత్వ ఉద్యోగులు, డిమాండ్లు విషయంలో ఆదినుంచి ప్రత్యేక చొరవ తీసుకోవడంతోపాటు, ప్రభుత్వం ఆలోచించే విధంగా, ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను కూడా ens live app ద్వారా ప్రత్యేక కధనాల రూపంలో తెలియజేస్తుందని. అదే ఒరవడిని ఇకముందు కూడా కొనసాగించాలి ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. వారి అభ్యర్ధనే కాకుండా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించిన విధంగా ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారి వెంట ens live app ఉంటుందని కూడా ప్రకటిస్తున్నాం. అదే విధంగా ప్రభుత్వ తాజా వార్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, అన్ని వర్గాల మీడియాగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రజా పక్షాన నిలిచి అటు ప్రజలకు, ఇటు ఉద్యోగులకు అసలైన వారధిగా ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ఎప్పటికీ నిలిచే ఉంటుందని కూడా చెబుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు విధినిర్వహణ చేయకపోతే ఏ ఒక్క కార్యక్రమం ముందుకి సాగదని ప్రభుత్వం గ్రహించాలి.. ఆదిశగా వారి న్యాయమపరమైన డిమాండ్లు పరిష్కరించాలి..అదేస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందాలి ఇదే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ లక్ష్యం..!
సిఫార్సు