ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ఆన్ లైన్ దరఖాస్తుల పరిశీలిన జూన్10 నుంచి ప్రారంభం అవుతుందని గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ సర్క్యులర్ జారీచేశారు. జూన్12న అభ్యర్ధులకు కేటాయించిన మండలాలు, వార్డుల జాబితా, తిరస్కరణలు ఆన్ లైన్ లో పొందు పరుస్తారు. 14న ఉద్యోగులకు కౌన్సి లింగ్ నిర్వహించి అదేరోజు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేస్తారు. అంతేకాకుండా వాటిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వీటిపై ఏమైనా అభ్యరంత రాలుంటే 15నుంచి జిల్లా కలెక్టర్ కు నివేదించుకోవచ్చునని పేర్కొన్నారు.