వైనాట్ 175 కాదు..వైనాట్ ప్రజాశాంతి పార్టీ కేఏపాల్..!


Ens Balu
37
Visakhapatnam
2023-08-03 17:26:16

ఆంధ్రప్రదేశ్ లో వైనాట్ 175 కంటే..వైనాట్ ప్రజాశాంతి పార్టీ కేఏపాల్ అని విశాఖ ప్రజలు తనకు పట్టం కట్టడం ఖాయమని..తాను ఇక్కడి నుంచే ఎంపీగా పోటీచేస్తానని అన్నారు. గురువారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో తెలుగు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మూడు రాజధానులు, సీఎం వైఎస్.జగన్ సెప్టెంబరు 1 నుంచి చేస్తానన్న ప్రకటనపై వ్యంగ్య అస్త్రాలు సంధించారు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణమా అని ఎద్దేవా వచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా అభివర్ణించారు. యువకులు, మేధావులు, మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, యూనివర్శిటీల ప్రొఫెసర్లు తమతో టచ్ లో ఉన్నారన్నారు. అటు తెలంగాణాలోనూ పోటీచేసి కెసిఆర్ కి చుక్కలు చూపిస్తామన్నారు. కార్యక్రమంలో టిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు, విశాఖజిల్లా అధ్యక్షు ఎల్జీనాయుడు పాల్గొన్నొరు.