ఏపీలో రేపటి నుంచి విద్యుత్ కార్మికుల సమ్మె..


Ens Balu
35
Vijayawada
2023-08-08 16:04:12

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు, ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగులు తాజాగా ప్రకటించారు. కాగా ముందు జాగ్రత్తగా విద్యుత్ సౌదా వద్ద 2000 మంది పోలీస్ బలగాలతో భారీ బద్రత ఏర్పాట్లు చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడ నందు 144 సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా విద్యుత్ బిల్లులు అధికంగా రావడంతో ప్రభుత్వంపై గుర్రుగా వున్న కార్మిక సంఘాలు కూడా విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. కాగా ఉద్యోగుల సమ్మె ముందుగానే ఊహించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అయితే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందున వలనే తాము సమ్మె చేస్తున్నట్టు కార్మికులు ప్రకటించారు.