9శాతం ఫిట్ మెంట్ కి ఓకే..విద్యుత్ సమ్మె లేదు..


Ens Balu
44
Vijayawada
2023-08-09 16:00:27

విద్యుత్ ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పీఆర్సీపై ఉభయుల మధ్య అంగీకారం కుదిరింది. విద్యుత్ జేఏసీ 15 శాతం ఫిట్మెంట్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం 9శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా అంగీకరించింది. ఈ ఒప్పందంపై యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు. సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు సబకమిటీ ఆమోదం తెలిపినట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. ఆఖరు నిమిషంలో బంద్ లేదనే విషయం ఉపసమనం కలిగించింది.