గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..!


Ens Balu
112
Tadepalli
2023-09-08 11:55:27

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో సేవింగ్స్ చేసుకునేందుకు వీలుగా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను ఉద్యోగులకు ప్రత్యేకంగా తెరిచి వారి శాలరీ బ్యాంకు ఖాతాలను కూడా లింక్ చేసింది. తద్వారా ఉద్యోగులు పెట్టుకున్న కటింగ్స్ నేరుగా పిపిఎఫ్ అకౌంట్ లోకి జమ అవుతా యి. వాస్తవానికి ఉద్యోగంలోకి చేరిన వెంటనే పిపిఎఫ్ అకౌంట్లు ప్రభుత్వం తెరవాల్సి వుంటుంది. కానీ ఉద్యోగాలు రెగ్యులర్ అయిన సుమారు ఆరు నెలలకు ఈ ఖాతాలను తెరిచింది. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన తొలి ఏడాది ఇంక్రిమెంట్ ఆర్డర్లు 19శాఖల సిబ్బందికీ పూర్తిస్థాయిలోరాలేదు. ఆయా ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం ఉంచి జిల్లా నేరుగా వీరికి సమాచారం అందుతుంది. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 ఇంక్రిమెం ట్లను ఇవ్వలేదు. కొత్తగా వేసిన ఇంక్రిమెంటుకి ఆర్ఢర్లు అందరికీ పూర్తిగా రాకపోవడం విశేషం.