గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు సేఫేనా..?!


Ens Balu
222
Amaravathi
2024-02-19 02:24:55

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సార్వత్రిక ఎన్నికల విధులు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తెచ్చుకున్నాయి. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా.. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసిక పుత్రికగా ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అడుగడుగునా అన్యాయమే జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టే లేదు. దీనితో ఎన్నికల విధులు అప్పగించిన సమయంలో తేడాలు వస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందునే వాదన బలంగా వినిపిస్తున్నాయి. అసలు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన ప్రధాన తప్పిదాలు ఒక్కసారి తెలుసు కుంటే.. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ సచివాలయశాఖను ఏర్పాటు చేసింది. పట్టణాల్లో వార్డు సచివాలయాలు 16 శాఖల సిబ్బం దితోనూ, గ్రామాల్లో గ్రామ సచివాలయాల 12 మంది సిబ్బందితోను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ శాఖలో ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖలతో సమానంగా సదుపాయాలు, ప్రయోజనాలు ఏర్పాటు చేయాలి. కానీ నాలుగేళ్లు దాటి పోతున్నా.. నేటికీ నాలు గైదు ప్రభుత్వశాఖల సిబ్బందికి సర్వీసు నిబంధనలు గానీ, ప్రమోషనల్ ఛానల్ గానీ ఏర్పాటు చేయలేదు.

 ఈ సిబ్బందిని రెండేళ్ల సర్వీసు తరువాత ఉద్యోగాలను రెగ్యులర్ చేయాల్సి ఉండగా వీరితో 9నెలలు అధనంగా విధులు చేయించుకొని ఆ తరువాత సర్వీసు రెగ్యులర్ చేసింది. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 1.30లక్షల మంది ఉద్యోగులు వారి పేస్కేలు, రెండు డిఏలను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా సర్వీసు రెగ్యులర్ చేసే సమయంలో వీరికి చెల్లించాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కూడా చెల్లించకుండానే వదిలేసింది. పైగా దానిపై నేటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అలా చేయడం వలన సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసే సమయంలో చాలా ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చింది. తద్వారా ఒక్కో ఉద్యోగి వీరి సర్వీసులో సుమారు రూ.3 లక్షల వరకూ ప్రయోజనాలు కోల్పోయారు.  కరోనా సమయంలో కూడా సచివాలయ ఉద్యోగుల సేవలు లేకపోతే ఏపీలో అత్యధికంగా ప్రాణ నష్టం జరిగి ఉందేడి.. సేవలు చేస్తూ ఉద్యోగులు మృత్యువాత పడి ప్రజలకు సేవలు అందిం చారు. కానీ వీరిని కనీసం ప్రభుత్వం గుర్తించలేదు. వీరికి అమలు చేయాల్సిన ప్రయోజనాల విషయంలో నేటికీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. బయటకి చెబితే ఎక్కడ వేటు పడుతుందోనని వీరంతా లోలోనే మధన పడుతున్నారు. సమయం వచ్చినపుడు తమ సత్తా చూపించాలని కూడా ఇటీవల రాష్ట్ర రాజధానిలో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నేటి వరకూ ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అన్ని ప్రభుత్వశాఖల సేవలు చేస్తున్నా తామ విషయంలో చాలా వివక్షకు గురవుతున్నామని మండి పడుతున్నారు. ఏప్రభుత్వ శాఖలో ఉద్యోగులైనా వారి శాఖ సేవలు మాత్రమే చేస్తారని..కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖల సేవలు చేయడంతోపాటు, ఖాళీగా ఉన్న ఉద్యోగుల విధులు కూడా చేయాల్సి వస్తోందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతో అయితే ప్రభుత్వానికి తీరని నష్టం ఏర్పడుతుందని.. ఈసారి ఎన్నికలకు సచివాలయశాఖ ఉద్యోగులను వినియోగించడం ద్వారా తమ ప్రభుత్వంలోనే వారికి ఉద్యోగాలొచ్చాయి గనుకు మం చి ఉద్దేశ్యంతో పనిచేస్తారని భావిస్తోంది. అయితే ప్రభుత్వం సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో చేసిన తప్పులను, ఎగ్గొట్టిన ప్రయోజ నాల విషయాని నిఘా సంస్థలు ఎప్పటి కప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూనే ఉన్నాయి. అయినప్పటికీ తమ ప్రభుత్వమే ఉద్యోగా లిచ్చిందని..పైగా ఉద్యోగులు తోక జాడిస్తే..చట్టబద్దత కల్పించని ఈశాఖ గాలిలో కలిసిపోతుందనే భయం కూడా వారికి ఉండాలనే ఆలోచ నతో ఉన్నట్టు కూడా సంకేతాలు అందుతున్నాయి. ఈ సచివాలయశాఖకు కేబినెట్ లో చట్టబద్దత ఆమోదం తెలియజేసినా..అసెంబ్లీలో మాత్రం బిల్లు రూపంలోకి తీసుకురాలేదు. అదే సమయంలో ఉద్యోగులను మభ్య పెట్టేందుకు కేవలం కొన్ని శాఖల ఉద్యోగులకే పదోన్న తులు కల్పించి మిగిలిన శాఖలను వదిలేసింది ప్రభుత్వం. దీనితో ఒకేసారి విధుల్లోకి చేరిన అందరు ఉద్యోగులకంటే కొన్ని శాఖల ఉద్యో గులకే పదోన్నతులు రావడం పట్ల కూడా మిగిలిన శాఖల ఉద్యోగులు తీవ్ర కోపంతో రగిలిపోతున్నారు. మరోవైపు మహిళాపోలీసుల ఉద్యోగాల విషయంలో ఇప్పటికే కోర్టులో కేసులు ఉండటం, ఇపుడు ఈ శాఖ ఉద్యోగులు ఏ ప్రభుత్వ శాఖకు చెందకుండా అన్నిశాఖల విధులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం వెల్పేర్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితరశాఖల ఉద్యోగులకు ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడంతో తమపరిస్థితి ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అందునా సచివా లయశాఖ ఉద్యోగుల సమస్యలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నింటినీ ఒకేసారి తీరుస్తామని ప్రత్యర్ధి రాజకీయపార్టీలు ప్రకటి స్తుండటంతో సచివాలయ ఉద్యోగులు వారి ఆలోచనలు మార్చుకొని, డిమాండ్లు, సమస్యలను ఇతర రాజరీయపార్టీకలు విన్నవిస్తు న్నారు.

 ప్రస్తుత గ్రామస్థాయిలో ప్రజలకి బాగా దగ్గర ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులే కావడంతో వీరి ద్వారా ఎన్నికల్లో బాగా నెట్వర్క్ చేసుకోవచ్చునని భావిస్తున్నాయి. అన్ని రాజకీయపార్టీలు వీరి సమస్యలు, డిమాండ్ లు తీర్చేందుకు హామీలు కూడా ఇస్తున్నాయి. ఈ తరుణంలో ఏ రాజకీయపార్టీ అయితే వీరికి పక్కాగా హామీలిస్తే వారికి ఉద్యోగులంతా మద్దతు కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఎన్నికల విధులు కట్టబెట్టినా తేడాలొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా అధికారపార్టీలోని కొందరు సీనియర్ నేతలు కూడా సచివాలయ ఉద్యోగులను పెద్దగా నమ్మే పరిస్థితి కూడా కనిపించడంలేదు. ఇప్పటికే చాలా ప్రయోజనాలు ప్రభుత్వ ద్వారా కోల్పోయిన ఉద్యోగులు మనస్పూర్తిగా ప్రభుత్వానికి ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తారా అంటే ప్రశ్నార్ధకమే. కానీ ఈ ఎన్నికల్లో ప్రభావం అంటూ చూపిస్తే 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులు, సిబ్బంది కంటే సచివాలయశాఖ ఉద్యోగుల వలన మాత్రమే ప్రతీకూలత కనిపించడానికి ప్రభుత్వ తప్పిదాలు కనిపిస్తున్నాయనేది సుస్పష్టంగా తెలుసున్నది. చూడాలి 2024 ఎన్నికల్లో ఏం జరగనుందనేది..1?