ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. మల్లగుల్లాల సచివాలయ మహిళా పోలీస్..?!


Ens Balu
296
visakhapatnam
2025-04-17 15:22:10

ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు చెప్పినట్టే గ్రామ, వార్డుు సచివాలయశాఖలో ప్రతీ అడుగు పడుతుండటం ఇపుడు మీడియా వర్గాల్లో చర్చనీ యాంశం అవుతున్నది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన మీడియాలో కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం సదరు మీడియాలోనే ప్రధానంగా వస్తుంటుంది. కానీ విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖకి సంబంధించి గత ప్రభుత్వంలోనూ.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ అనుకూల మీడియాకి రాని సమాచారం, తెలియని అంశాలు ఒక్క ఈరోజు-ఈఎన్ఎస్ లో మాత్రమే ప్రత్యేక కథనాలుగా వెలువడుతున్నాయి. అంతేకాదు.. కథనాల ఆధారంగానే కూటమి ప్రభుత్వంలోని పరిపాలనా విభాగం అడు గులు వేస్తున్నదంటే ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల్లో వాస్తవికత ఏస్థాయిలో ఉందో ఇపుడు రాష్ట్రంలోని ప్రధాన మీడియా సంస్థలకు తెలిసొచ్చింది. ఈరోజు-ఈఎన్ఎస్ లో స్టోరీ వస్తే నిజమవుతుందా.. ఆ మీడియా అంత తోపా.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందా అని బీరాలు పోయిన వాళ్లే ఇపుడు ప్రత్యేకంగా జీఓలు, ఉత్తర్వులు ప్రభుత్వం జారీచేయడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు..!

నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ.. నేటి కూటమి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖకు సంబంధించిన తాజా అంశాలను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రజలు, ఉద్యోగుల ముందుకి తీసుకురావడం, అదే అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇక్కడ విశేషం. గత కొన్నేళ్లుగా ప్రభుత్వశాఖలేని ఉద్యోగులుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు కూటమి ప్రభుత్వం ఒక ప్రభుత్వశాఖను కేటాయించే చర్యలు చేపట్టింది. దానికోసం నాలుగైదు ప్రభుత్వశాఖల్లోని క్యాడర్లు, పదోన్నతులు, సర్వీస్ రూల్స్, మహిళా పోలీసుల సర్వీస్, గతంలో వీరికోసం తయారు చేసిన ప్రమోషన్ ఛానల్, వారికి నచ్చిన శాఖను ఎంచుకునే అంశాన్ని వారి ముందుకి తీసుకురావడానికి మల్లగుల్లాలు పడుతున్నది. గ్రామ, వార్డు సచివాలయశాఖలో 26 జిల్లాల్లోని 15వేల 4 సచివాలయాల్లో సుమారు లక్షా 28వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా ఒక్క మహిళా పోలీసు విభాగంలోనే  13910 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి మాతృశాఖ పోలీసుశాఖ అయినప్పటికీ, వీరిని పోలీస్ రిక్రూట్ మంట్ బోర్డు ద్వారా కాకుండా ఎపీపీఎస్సీ ద్వారా నియమాకాలు జరిపారంటూ కోర్టులో కేసు వేయడంతో వీరికి మూడేళ్లుగా ప్రభుత్వశాఖ లేకుండా పోయింది. 

వీరు పోలీసుశాఖకు చెందినవారు కాదని గత ప్రభుత్వం కోర్టుకి లిఖిత పూర్వకంగా లేఖ సమర్పించడంతో నాటి నుంచి నేటి వరకూ వీరు గాల్లోనే ఉన్నారు. గత ప్రభుత్వం అదిగో ఇదిగో అని కాలయాపన చేసింది తప్పిగే పోలీసుశాఖలో వీరికి మినిస్టీరియల్ స్టాప్ గానీ, పీఆర్భీ ద్వారా శిక్షణ ఇచ్చి పోలీసు సిబ్బందిగా కూడా తీసుకోకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోం మంత్రి వంగలపూడి అనిత ఈ విషయాన్ని అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ చర్చించి వీరి చదువులు, వయస్సు, శారీక ధృడత్వాన్ని బట్టి వారికి డిపార్ట్ మెంట్ స్టైడింగ్ ఇవ్వాలని ఆలోచన చేసింది. ఆలోచన అయితే వచ్చింది గానీ ఏ క్యాడర్ లో వీరికి కోరుకున్న శాఖలకు పంపాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నది. ప్రస్తుతం గత ప్రభుత్వం పెంచేసిన రెండేళ్ల అదనపు ఉద్యోగ విరమణ వయస్సు పూర్తయి చాలా ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు ఉద్యోగవిరమణలు చేయడంతో వేల సంఖ్యలో శాఖల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీల్లో వీరిని భర్తీచేయాలంటే వీరికి దగ్గరగా ఉన్న ప్రభుత్వశాఖలైతే వారిని అటుు సచివాలయాల్లోనూ, ఇటు కలిపేసిన ప్రభుత్వశాఖలోనూ రెండింటివద్దా పనిచేయించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 

దానికోసం గత ఏడాది అనధికారికంగా వీరిని పోలీసుశాఖలోని వివిధ పనులు, కార్యాలయ పనులు, బందోబస్తు పనులు ఇలా నచ్చిన విధంగా విధులు చేయించింది. ఆ సమయంలో కూడా కొందరు తమకు ప్రభుత్వశాఖ కేటాయించాలని, ఈ శాఖ కాకుండా మరోశాఖకు బదిలీచేయాలని ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకోవడంతో ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నది. దానికోసం వయస్సుఉండి ఫిట్ గా ఉన్నవారిని పీఆర్బీ ద్వారా ఫిజికల్ టెస్ట్, శిక్షణ ఇచ్చి పోలీసులుగానూ, లేదంటే వయసు దాటిన వారిని పోలీసుశాఖలోనే కార్యాలయాల్లో మినిస్టీరియల్ స్టాప్ గానూ, అదే కాదంటే పదోన్నతి ఇస్తున్నట్టుగా చూపించి గ్రేడ్-2 ఐసిడిఎస్ సూపర్ వైజర్ గా డిపార్ట్ మంట్ స్లైడింగ్, ఆప్సన్లు ఇచ్చి వారిని బదిలీ చేయాలని యోచిస్తున్నది. కోరుకున్న ప్రభుత్వశాఖలకు బదిలీచేసినా అటు మాతృశాఖ, ఇటు సచివాలయశాఖలో రెండింటిలోనూ మహిళా పోలీసులు పనిచేయాల్సి వుంటుందనే క్లాజుని రాష్ట్రంలోని ఉన్నతాధికారులు పెట్టినట్టుగా ఇక్కడ సమాచారం అందుతుంది. దానికి కారణం ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలన్నా.. వాటిని ప్రజలకు అందించాలన్నా సిబ్బంది చాలా అవసరం. 

ఉన్న మహిళా పోలీసులను శాఖలు కోరుకోమని అక్కడికి పంపేస్తే.. గ్రామ, వార్డు స్థాయిలో పథకాల అమలు కష్టతరం అయిపోతుంది. దానికోసం వారికి డిపార్ట్ మెంట్ అలాట్ మెంట్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ వెళ్లే శాఖలను అనుగుణంగా చేసి.. వారిని మళ్లీ సచివాలయాల్లోనే విధులు నిర్వహించేలా చేస్తే.. కొత్త ఉద్యోగాలు భర్తీచేసేవరకూ ప్రభుత్వానికి పరిపాలనా పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయని ప్రభుత్వానికి తమ నివేదికలో కొందరు ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. మరోప్రక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే చాలా విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిలోకి మహిళా పోలీసులను తీసుకున్నా.. అక్కడి ఖాళీలు భర్తీతోపాటు, ప్రస్తుతం ఉద్యోగుల భర్తీ సమస్య కూడా తీరినట్టు వుంటుందని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ద్వారా ప్రత్యేక కథనాలు అందించింది. ప్రస్తుతం వాటిపైనే రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి ప్రభుత్వశాఖల కేటాయింపుతోపాటు, ఇతర ప్రభుత్వశాఖ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ప్రయోజనాలన్నీ సచివాలయ ఉద్యోగులకు కూడా అందిస్తే.. వారికి న్యాయం చేసినట్టు అవుతుందని భావిస్తున్నది. 

ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా పోలీసుల్లో చాలా 30శాతానికి పైగా వారికి పోలీసుశాఖలో ఉంటం ఇష్టం లేదని, తమని ఐసీడిఎస్  కి పంపేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 50శాతం మంది పోలీసుశాఖలో ఉంటామని తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. మరో 10శాతం మంది తమను పోలీసుశాఖలోనే ఉంచి పోలీస్ స్టేషన్లు లేదా, జిల్లా ఎస్సీ కార్యాలయాలు, డిఎస్సీ కార్యాలయాల్లో మినిస్టీరియల్ స్టాఫ్ గా నియమించాలని కోరుతున్నారు.  మరికొందరు ఐదు ఉద్యోగాలకు పోటీ పరీక్ష రాసి మహిళా పోలీసులుగా సెలక్ట్ అయ్యామని, ఖాళీగా ఉన్న ఇతర శాఖల పోస్టుల్లో తమను భర్తీచేయాలని..తామంతా డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసి ఉన్నామని కూడా ప్రభుత్వానికి అర్జీలు చేశారు. ఈ విషయాలను కూడా ఈరోజు-ఈఎన్ఎస్ పతాక శీర్షికన ప్రత్యేక కథనాలు అందించింది. దీనితో ఎట్టకేలకు మహిళా పోలీసులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వశాఖల్లోనే వారు కోరున్న శాఖకు పంపించి వారికి డిపార్ట్ మెంట్ అలాట్ మెంట్ చేసి రూట్ క్లియర్ చేయాలని ప్రభుత్వం అన్ని రకాలుగా సంప్రదింపులు చేస్తున్నది. 

అన్నీ అనుకున్నట్టు  జరిగితే నెలాఖరు లేదా. వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్, ప్రభుత్వశాఖలను ఎంచుకునే ఆప్షన్ వస్తుందని సమాచారం అందుతుంది. ఎక్కువ మంది మహిళలు పోలీసుశాఖను కోరుకుంటే వారిని పీఆర్బీబీ ద్వారా ఫిజికల్ టెస్టులు పెట్టి వారిని పోలీసుశాఖలోకి తీసుకొని మహిళా పోలీసు స్టేషన్లలో ఖాళీలను భర్తీచేయాలనే ప్రతిపాదన కూడా ఇపుడు తెరపైకి వచ్చింది. చూడాలి ప్రభుత్వం మహిళా పోలీసుల విషయంలో మల్లగుల్లాలు పడి..ఏ నిర్ణయం తీసుకుంటుందనేది..?!