గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి గుడ్ న్యూస్.. దస్త్రం ఫైనాన్స్ దగ్గరకి..?!


Ens Balu
90
visakhapatnam
2025-05-21 21:07:59

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కష్టాలు తీరే సమయం దగ్గర్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నది.. విశాఖలో పట్టణ పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పిన విషయం ఆధారంగా ఉద్యోగుల సర్వీసు నిబంధనలు,  పదోన్నతుల దస్త్రం ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది.. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను ఈరోజు-ఈఎన్ఎస్ ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్స్ విషయమై ప్రశ్నించగా కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.. దానిని బట్టి సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే లైన్ క్లియర్ అయ్యే సూనలు కనిపించాయి. అయితే దాని కోసం ఇంకా చేయబోతున్నారో కూడా మంత్రి మీడియాకి వివరించారు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గత ఐదేళ్లుగా సర్వీసు ప్రభుత్వశాఖ కేటాయింపులు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్స్, క్యాడర్ కూడా లేకుండా పనిచేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆయా ప్రభుత్వశాఖల మంత్రలు ఒక్కొక్కరుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారాని చొరవ చూపుపుతున్నారు. దీనితో ఈరోజు-ఈఎన్ఎస్ కథనాల స్పందన లభిస్తూ ఉద్యోగుల ప్రమోషన్స్ కి లైన్ క్లియర్ కావడానికి ఒక్కో అడ్డంగి తొలగుతూ వస్తున్నది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నది. ఈ మేరకు పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని విశాఖ పర్యటన సందర్భంగా మీడియా ముఖంగా ప్రకటించారు. తమ శాఖలో చాలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని.. అయితే వాటిని పదోన్నతులతో భర్తీచేయడానికి అన్ని పనులూ చేసి క్యాబినెట్ లో అప్రూవల్ చేయించడానికి  దస్త్రాన్ని ఫైనాన్స్ శాఖకు పంపితే అక్కడ ఫైలు నిలిచిపోయిందన్నారు. పట్టణ పురపాలకశాఖ మాదిరిగానే మిగిలిన ప్రభుత్వ శాఖల నుంచి దస్త్రాలు వస్తే ఒకేసారి అన్నిశాఖల ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనలు ఆయా ప్రభుత్వ శాఖల్లోని క్యాడర్ ఆధారంగా పదోన్నతులు కల్పించనున్నామన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని తాను పట్టణపురపాలకశాఖ ముఖ్యకార్యదర్శితో సమాచాలోచనలు చేశామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ ప్రత్యేకంగా చర్చించినట్టు మంత్రి నారాయణ వివరించారు. తప్పనిసరిగా సచివాలయశాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నామన్నారు. దానికోసం మిగిలిన శాఖాధిపతులు, మంత్రుల నుంచి కూడా లేఖలు ఫైనాన్స్ కి చేరాల్సి వుందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వశాఖలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయని చెప్పుకొచ్చారు.

-ప్రస్తుతానికి 4 ప్రభుత్వ శాఖలకు లైన్ క్లియర్
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని పట్టణ పురపాలకశాఖ, మత్స్యశాఖ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తుంది( పదోన్నతులు, ప్రభుత్వశాఖలకు ఉద్యోగుల విలీనానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు.. అయితే ఇంకా అనుమతులు రావాల్సి వుంది.). . ఇంకా ఇంజనీరింగ్, రెవిన్యూ, సర్వే, సంక్షేమం, ఇంజనీరింగ్,  ప్లానింగ్, ఇతర శాఖల్లో ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే వ్యవసాయశాఖలో గత ప్రభుత్వంలోనే పదోన్నతులు కల్పించారు. ఆరోగ్యశాఖలో కూడా కొన్ని సాధారణ ఇన్ ఇర్వీస్ పదోన్నతులు కల్పించారు.  మిగిలిన శాఖలకు చెందిన మంత్రులు కూడా వారి శాఖల ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తే అవి ఫైనాన్స్ విభాగంలో క్లియర్ అయ్యి క్యాబినెట్ దృష్టికి వెళతాయి. తద్వారా ఖాళీల భర్తీతోపాటు, సచివాలయ ఉద్యోగులకు నిర్ధిష్ట్ ప్రభుత్వశాఖ కేటాయింపుతోపాటు, ఉద్యోగులకు పదోన్నతులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాగా 2019 అక్టోబరు 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు దగ్గర నుంచి ఉద్యోగుల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, సుమారు ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను  ఈరోజు-ఈఎన్ఎస్ ఎప్పటికప్పుడు ప్రత్యేకథనాల రూపంలో అందిస్తున్నది. ఉద్యోగుల పక్షాన నిలబడి పనిచేస్తున్నది.

-ఉద్యోగులకు గాలికి వదిలేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందనే ఆవేదన నేటికీ ఉద్యోగులను వెంటాడు తోంది. రాష్ట్రప్రభుత్వంలోని ఏ ప్రభుత్వ శాఖ తమలా ఉండదని నేటికీ కన్నీటి పర్యంతం అవుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఏ ఉద్యోగికైనా ఒక ప్రభుత్వశాఖ మాత్రమే ఉంటుందని.. కానీ ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు మాత్రం ఒక ఉద్యోగం అదీ తలా తోకా లేని ఉద్యోగం, అమలు కానీ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, క్యాడర్ లేకుండా ఉన్నాయని. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన విధులూ తామే చేయాల్సి వస్తున్నదని, ఐదేళ్లు ఆ విధంగానే అదనపు పనులు చేయించుకున్నా.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ఇవ్వాల్సిన ప్రయోజనాలను మాత్రం ఇవ్వకుండా తాత్సారం చేసుకుంటూ వచ్చిందని వాపోతున్నారు. శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ఇంటి దగ్గరుండే పనులు చేయించే అలవాటు గత ప్రభుత్వం నుంచి ప్రస్తు కూటమి ప్రభుత్వం వరకూ కొనసాగుతుం దని వాపోతున్నారు. ఇంత చేస్తున్న తమకు తమ ఉద్యోగ భద్రత విషయంలో తమశాఖల మంత్రులు, ప్రభుత్వశాఖల అధికారులకు ఆరేళ్లుగా విధి విధానాలు రూపొందించే ఖాళీ లేకుండా పోయిందని చెబుతున్నారు. ఫలితంగా ఎలాంటి పదోన్నతులు గానీ, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగ ప్రయోజనాలకు కూడా తాము నోచుకోలేకపోతున్నామని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మాత్రుశాఖల్లో విలీనం చేస్తే తమ ఉద్యోగాలకు ఒక అర్ధం వుంటుందని చెబుతున్నారు. చూడాలి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన, చేస్తున్న పనులు ఏ మేరకు కార్యరూపం దాల్చుతాయనేది..!


సిఫార్సు