గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్..!


Ens Balu
138
visakhapatnam
2025-05-23 06:56:26

ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది..! ఎట్టకేలకు కరుణించిన కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు శుభవార్త చెప్పింది.. కోర్టు కేసులు కారణంగా ఇప్పటి వరకూ గాల్లో ఉన్న సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వ శాఖ కేటాయించేందుకు నడుంబిగించింది.. దానికోసం వారికి రెండు ప్రభుత్వశాఖలు ఆప్షన్లు ఇస్తున్నట్టుగా ఆన్ లైన్ లోనే ఎంచు కునే సదుపాయం కల్పించింది. దీనితో ఇప్పటి సచివాలయాల్లో పనిచేస్తున్న వీరికి ఒక నిర్ధిష్ట ప్రభుత్వశాఖ కేటాయింపులు జరగను న్నా యి.. ప్రభుత్వశాఖ కేటాయించి, నిబంధనలు పొందుపరిస్తే తప్పా సదరు శాఖ సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ వీరికి వర్తించవు.. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడానికి మాత్రం ఏడాది సమయం తీసుకున్నది.. హామీ ఇచ్చిన దగ్గర నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల ద్వారా సచివాలయ ఉద్యోగుల సమస్యలను ఎప్పటి కప్పుడు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ప్రభుత్వం వీరికి ఆప్షన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..!

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ చేస్తున్న కృషికి కూటమి ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కటిగా ఫలితాలు వస్తున్నాయి. సచివాలయ మహిళా పోలీసులు ఏ ప్రభుత్వశాఖ లేకుండా గాల్లో ఉన్న విషయాన్ని వరుస కథనాల ద్వారా చాలా కాలం నుంచి తెలియజేస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినా కొద్దిగా తాత్సారం పరిపాలనా పరమైన సమస్యతో జరిగింది. దానితో సమస్య తీవ్రతను ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాల ద్వారా తెలియజేయడంతో స్పందించిన ప్రభుత్వం వారికి రెండు ప్రభుత్వశాఖల ఆప్షన్లు ఇచ్చింది. మహిళా పోలీసులు ఏ ప్రభుత్వశాఖ ఎంచుకుంటే అందులోకి వారిని పంపడం ద్వారా సమస్య పరిష్కరించడంతోపాటు సదరుశాఖల్లో ఖాళీలను భర్తీచేసినట్టుగా ఉంటుందని కూటమి ప్రభుత్వం భావిస్తున్నది. 2019లో అక్టోబర్ 1న గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి సచివాలయ మహిళా పోలీసుల విషయంలో కోర్టులో కేసులు పడ్డాయి.

 వీరికి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేశారని.. దానితో పోలీసు శాఖ ద్వారానే నియామకాలు జరిగినా.. వీరికి పోలీసుశాఖకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుశాఖ హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేసింది. అప్పటి నుంచి సచివాలయ మహిళా పోలీసులు కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాప్ గానే పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దానితో విషయ తీవ్రతను తెలుసుకున్న కూటమి ఎన్నికల్లోనే హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని హామి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వరకూ ఏ సమస్యా పరిష్కరించకపోవడంతో ఈరోజు-ఈఎన్ఎస్ వీరి సమస్యలను సదరు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, ఉద్యోగ సంఘాల వినతులతో ఈ విషయాన్ని అసెంబ్లీ, శాసన మండలిలో కూడా పెద్ద ఎత్తున ప్రస్తావించారు. అంతా సమస్య పరిస్కారం అవుతుందనుకున్నా పరిపాలనా పరమైన ఆలస్యం కావడంతో ఉద్యోగుల సమస్యలపై ఈరోజు-ఈఎన్ఎస్ సామాజిక బాధ్యత తీసుకొని వీరి సమస్య తీవ్రను వరుస కథనాల ద్వారా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది. 

దీనితో స్పందించిన ప్రభుత్వం వీరి సమస్యను పరిష్కరించడంతోపాటు, వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ మెంట్ కావడంతో భారీగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీచేసుకోవడానికి వీలుగా వీరికి రెండు ప్రభుత్వశాఖల్లో ఆప్షన్లు ఇచ్చింది. మహిళా పోలీసులు విధుల్లోకి చేరినపుడే చాలా మంది తమకు పోలీసుశాఖ ఇష్టం లేదని కూడా కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. అప్పటి నుంచి వీరి సమస్యను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఆతరువాత కూటమి ప్రభుత్వం వీరి సమస్యకి ప్రాధాన్యత కల్పించింది. ప్రస్తుతం వీరికి రెండు ప్రభుత్వశాఖల అప్షన్లు ఆన్ లైన్ లో ఇవ్వడంతోపాటు, వాటి విధి విధానాలను కూడా పొందుపరిచే పనిలో పడింది రాష్ట్రప్రభుత్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావడానికి ఒక రెండు నెలలు సమయంల పట్టేట్టుగానే కనిపిస్తున్నది.


-ప్రస్తుతానికి ఆప్షన్లు మాత్రమే ఆన్ లైన్ లో
గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ఇచ్చిన రెండు ప్రభుత్వ శాఖల ఆప్షన్లు మాత్రమే ప్రస్తుతం ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. వాటిని ఎలా ఎంచుకోవాలి, ఏ ప్రభుత్వశాఖలో ఉన్న విధి విధానాలు ఏంటి అనే సమాచారం మాత్రం ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిస్థాయిలో ఓ కొలిక్కి రావాలంటే ఇంకా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14వేల మందికి పైగా మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వీరిలో కొంత మంది తమకు ఐసిడిఎస్ కావాలని పట్టు బట్టడంతో వారినే ప్రభుత్వశాఖలు ఎంచుకునేవిధంగా ప్రభుత్వం ప్రస్తుతానికి ఆప్షన్లు కల్పించింది. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన తరువాత ఉద్యోగులు ఆప్షన్లు ఎంచుకోవడానికి వీలుపడుతుంది. తరువాత వారంతా ఆయా ప్రభుత్వశాఖల ఉద్యోగులుగా ఉంటారా..? సచివాలయాల్లోనే పనిచేస్తారా..? శాఖలు కేటాయించిన తరువాత వారిని సదరు శాఖలకు బదిలీలు చేస్తారా అనే విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి మాత్రం మహిళా పోలీసులకు నేటి వరకూ లేకుండా ఉన్న ప్రభుత్వశాఖ కేటాయించడానికి మాత్రం కూటమి ప్రభుత్వం ఒక రూట్ ని ఏర్పాటు చేసింది. ఆ రూటు ఏ గమ్యస్థానం చేరుకుంటుందనే విషయంపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ తంతు పూర్తవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో  రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలు కూడా నిలుపుదల చేసింది. 


-ఇప్పటికైనా ఉద్యోగులకు  సర్వీసు రూల్స్ అమలుచేయాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వశాఖలోని క్యాడర్ ఆధారంగా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ శాఖలోకి వచ్చిన వారికి అమలు చేయకపోతే.. ఉద్యోగులకు ప్రభుత్వశాఖ ఏర్పాటైనా ప్రధాన సమస్య మాత్రం అలాగే ఉండిపోయే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన తరువాత గత ప్రభుత్వంలో సర్వీసు ప్రొభేషన్ సమయంలో తొమ్మిది నెలలు అధనంగా విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫుల్ పేస్కేలు కోల్పోయారు. తరువాత సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో పడాల్సిన మరో రెండు ఇంక్రిమెంట్లు కోల్పోయారు. కోర్టు కేసులు కారణంగా మొదటి పదోన్నతి కోల్పోయారు.. పీఆర్సీ అమలు చేసిన సందర్భంలో పెంచిన పేస్కేలు తప్పా, ఇతర ప్రయోజనాలన్నీ కోల్పోయారు. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఆప్షన్లు ఇచ్చిన సమయంలోనే ఏ ప్రభుత్వశాఖలో ఏ సర్వీసు నిబంధనలు ఆప్షన్లు ఎంచుకున్న వారికి అమలు జరుగుతాయో ప్రభుత్వం నిర్ధిష్టంగా తెలియజేయాల్సిన  అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వీరికి డిపార్డ్ మెంట్ స్లైడింగ్ ఇచ్చినా ఎలాంటి ఉపయోగం మాత్రం ఉండదు. ఏదో కంటితుడుపు చర్యగా ప్రభుత్వశాఖ కేటాయించేసి ఊరుకున్నట్టుగానే వ్యవహారం ఉంటుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా కూటమి ప్రభుత్వంలోనైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందునా మహిళా పోలీసుల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులకి వర్తింపజేసే అన్ని రకాల ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. లేదంటే శాఖల్లోకి వచ్చిన తరువాత కూడా వీరిని అవే సమస్యలు వెంటాడుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

-ఈరోజు-ఈఎన్ఎస్ కి సచివాలయ ఉద్యోగుల కృతజ్ఞత లు
2019 జనవరి 1 నుంచి రాష్ట్రప్రభుత్వంలో 75 ప్రభుత్వశాఖగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ  ఉద్యోగుల సమస్యలను ఒక్క ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే సామాజిక బాధ్యతగా తీసుకొని ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కీలకం వ్యవహరించిందంటూ  సచివాలయ ఉద్యోగులు కార్యాలయానికి ఫోన్లు చేసి  కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో చాలా మీడియా సంస్థలున్నా.. కేవలం తమ శాఖ ఉద్యోగులకు ఎప్పుడు ఏం జరిగినా ప్రతీ అంశాన్నీ కేవలం  ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే వెలుగులోకి తీసుకు వస్తూ తమకు అండగా నిలుస్తున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు జరగాల్సిన తమ సర్వీసు ప్రొభేషన్ ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో తొమ్మిదినెలలు పొడిగించిన సమయంలో కూడా వరసు కథనాలు ప్రచురించి, సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలోనూ సహకరించారని, తరువాత పీఆర్సీ ప్రయోజనాలు అమలు చేసే విషయంలోనూ, సర్వీసు రెగ్యులర్ చేసిన సమయంలో కలపాల్సిన రెండు ఇంక్రిమెంట్లు సమయంలోనూ, ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు విషయంలోనూ,  ఉద్యోగులపై అధికారులు వేధింపులకు గురిచేస్తున్న సమయంలోనూ, తమ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలోనూ  బదిలీల విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లోనూ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే మాత్రమే తోడుగా నిలిచిందంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు-ఈఎన్ఎస్ ద్వారా రాష్ట్రప్రభుత్వంలో ఒకే ఉద్యోగంతో అనేక ప్రభుత్వశాఖల సేవలు చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటుందని కూడా యామమాన్యం తెలియజేస్తున్నది. వరుస కథనాలపై స్పందించడం పట్ల తమ హర్షాన్ని ప్రకటిస్తున్నది..!
సిఫార్సు