సచివాలయ ఉద్యోగులకు షాక్.. నిన్న ఆప్షన్లు ఇచ్చారు.. నేడు తొలగించారు..?!


Ens Balu
322
visakhapatnam
2025-05-27 15:10:05

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు(GSWS) ఆశ కల్పించి.. హడావిడి చేసి.. ఏమీ చేయకుండా గత వైఎస్సార్సీపీ(YSRCP) ప్రభుత్వం కంటే తాత్సారం చేయడానికి ఒక సాకు ప్రభుత్వానికి భలే దొరికింది.. చేసేది ప్రభుత్వ ఉద్యోగమే అయినా నేటికీ ప్రభుత్వశాఖ లేని సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్(OPTIONS) అంటూ సీఎఫ్ఎంఎస్ లాగిన్ లో ఆప్సన్లు అందుబాటులోకి తెచ్చి..  కాస్త ఊరించి మళ్లీ తొలగించేసిన ప్రభుత్వం.. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ.. ఆన్ లైన్ లో ఆప్షన్లు చూసుకుని ఆనంద పడిన క్షణం పాటు కూడా ఆప్షన్లు ఆన్ లైన్ లో ఉంచకుండా తీసేసి ఉద్యోగులను త్రిశంఖు స్వర్గంలో ఉంచేసింది కూటమి సర్కారు(TDP)..తలా తోకా లేకుండా సచివాలయ శాఖను ఏర్పాటు చేసి వారిని గాల్లోపెట్టి, వారి జీవితాలతో ఆడుకుందంటూ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తిన కూటమి సర్కారు.. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా  ఉద్యోగుల సమస్యను పరిష్కరించకపోగా.. ఇంకాస్త జఠిలం చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది.. కూటమి వచ్చింది కష్టాలు తొలగిపోతాయనుకుంటే.. ఉన్నబాధలు రెట్టింపై తమకు ప్రభుత్వ శాఖ కేటాయింపు మరింత ఆలస్యం అయ్యేలా వుందంటున్నారు మహిళా పోలీసులు..!

మీడియా(MEDIA)లో వార్తలు వస్తున్నాయంటే ఊరకే వస్తాయా..? ప్రభుత్వంలో తేడాగా చేసే పనులు బట్టే పత్రికలు, టీవీల్లో చేసిన పనులను ఎండగడుతూ వార్తలొస్తాయి అంటున్నారు విశ్లేషకులు.. ఇంతకీ ఏం జరిగిందని అడగరేం..? వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను తలా తోకా లేకుండా ఏర్పాటు చేసి ఉద్యోగులకు కనీసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, ప్రభుత్వశాఖ, నిర్ధిష్టమైన క్యాడర్ అంటూ ఇవ్వలేదని..ఇదేనా పరిపాలనా విధానమంటూ అసెంబ్లీ సాక్షిగా చర్చకు లేవనెత్తిన కూటమి సర్కారు గత ప్రభుత్వం కంటే దారుణంగా తాత్సారం చేస్తున్నట్టు అధికారికంగానే కనిపిస్తున్నది. దానికి ఉదాహరణ గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులకు ప్రభుత్వశాఖ కేటాయించడానికి తీసుకొచ్చిన డిపార్ట్ మెంట్ స్లైడింగ్ అంశమే. కోర్టు కేసుల కారణంగా నేటి వరకూ గాల్లోనే ఉన్న సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇస్తామని చెప్పి వారిలో ఆశలు రేపిన ప్రభుత్వం ఆన్ లైన్ లో ఐసిడిఎస్, పోలీసుశాఖ రెండు ఆప్షన్లు ఇచ్చి ముచ్చటగా మూడు రోజులు ఉంచి మళ్లీ వాటిని ఆన్ లైన్ లో ఉలుకూ పలుకూ లేకుండా చేసింది. దీనిని సాకుగా చూపి ఉద్యోగుల  సాధారణ బదిలీలను కూడా నిలిపివేసింది. డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ద్వారా అయినా తమకు ఒక నిర్ధిష్ట ప్రభుత్వ శాఖ కేటాయింపు జరుగుతుందని ఆశపడిన మహిళా పోలీసులకు ఆ ఆశ కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలింది. ఇచ్చిన ఆప్షన్లు ఆన్ లో డిజేబుల్ చేసేశారు. ఇపుడు కనీసం చూడటానికి కూడా వీలు లేకుండా పోయింది.

-ప్రభుత్వశాఖలు(AP GOVT) సరే ఏ క్యాడర్ ఇస్తారు..?
సచివాలయ మహిళా పోలీసులకు రెండు ప్రభుత్వశాఖలను ఆన్ లైన్ స్లైడింగ్ ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం వారికి ఏ క్యాడర్ ఇస్తుందో తెలియజేయలేదు. వాస్తవానికి రాష్ట్రప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటు చేస్తే దానికి నాల్గవ తరగతి ఉద్యోగం నుంచి గ్రూప్-1 క్యాడర్ ఉద్యోగం వరకూ పదోన్నతులు, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానం అంతా ముందుగానే పొందు పరుస్తారు. కానీ విచిత్రంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వంలోని మాతృశాఖల ద్వారా సచివాయల ఉద్యోగులను నియమించినా.. వారికి నిర్ధిష్టమైన క్యాడర్, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. దానితో వీరంతా ఉద్యోగాల్లోకి వచ్చి ఐదేళ్లు దాటిపోతున్నా నేటికీ పదోన్నతులు లేకుండా ఇంకా అలాగే ఉన్నారు. అందులో ఒకటి కోర్టు కేసు కారణం అయితే, రెండవది హైకోర్టుకి గత ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేయడం. గత ప్రభుత్వం చేసిన తప్పునే కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది తప్పితే.. చేసిన తప్పుని సరిచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలనే తలంపు ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. మహిళా పోలీసులకు ప్రభుత్వ శాఖ కేటాయిస్తామని రెండు శాఖల ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం  వారికి ఏశాఖ సర్వీసు రూల్స్ వర్తిస్తాయో చెప్పే విధివిధానాలు రూపొందించకుండా కేవలం ఆప్షన్లు మాత్రమే ఆన్ లైన్ లో పెట్టి మూడు రోజులు హడావిడి చేసి మళ్లీ వాటిని డిసేబుల్ చేసేసింది.

-ఇప్పటి వరకూ చేసిన సర్వీసు(AP GOVT SERVICE) లెక్కిస్తారా..?
గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వశాఖల ఆప్షన్లలో ఏ శాఖ ఎంచుకుంటే ఆశాఖలోకి తీసుకున్న తరువాత ఇప్పటి వరకూ చేసిన సర్వీసుని లెక్కిస్తారా..? లేదంటే డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చాం కదా మళ్లీ మరో ఐదేళ్లో, ఏడోళ్లో పనిచేయించిన తరువాత పదోన్నతి కల్పిస్తారా..? అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయాలని భావిస్తే.. ప్రస్తుతం వీరికి ఇచ్చిన రెండు ప్రభుత్వ శాఖలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారిని ఎంచుకో మని చెప్పిన తరువాత.. ఆ ప్రభుత్వశాఖలో ఇప్పటి వరకూ చేసిన సర్వీసును లెక్కించాల్సి వుంటుంది. ఆ తరువాత ఆ సీనియారిటీ ప్రకారం ఎంచుకున్న శాఖలో సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ అమలు చేసి దానిని పరిగణలోకి తీసుకొని వారికి పదోన్నతులు కల్పించాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వం ఇపుడు వారికి కేవలం ప్రభుత్వశాఖ మాత్రమే కేటాయించి వారి సేవలను యధావిధిగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా సచివాలయాల్లోనే వినియోగించుకుంటే మాత్రం వీరికి పదోన్నతులు రానట్టే లెక్క. అంటే కొత్తగా మళ్లీ ప్రభుత్వశాఖలోకి వస్తున్నారు కనుక సర్వీసు నిబంధనల ప్రకారం మరో ఐదేళ్లో, ఏడేళ్లో సర్వీసు చేస్తేనో తప్పా వీరికి పదోన్నతులు వచ్చే పరిస్థితి ఉందడు. ప్రస్తుతం ఇదే అంశాన్ని రాష్ట్రప్రభుత్వం కూడా చాలా లోతుగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఆకారణంగా ఆన్ లైన్ లో డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చిన మూడ్రోజుల్లే మళ్లీ దానిని మూసేసిందని చెబుతున్నారు. దానికితోడు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియ మొదలు కావడండ ఒక కారణమైంది.

-రాష్ట్రప్రభుత్వం(AP GOVT) తలచుకుంటే  అది ఒక్కరోజు పని
సచివాలయ మహిళాపోలీసులతోపాటు, నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, క్యార్ అలాట్ మెంట్ లేని సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటే అది ఒక్కరోజు పని. ఏ విధంగా, ఏ ప్రభుత్వశాఖల ద్వారా సచివాలయ ఉద్యోగులను నియమించారో ఆ శాఖల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఆ పనిచేయడం లేదు. ప్రభుత్వానికి కావాల్సిన సర్వేలు, ఒక ఉద్యోగితో ఐదారు ప్రభుత్వశాఖల పనులు చేయించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే ఉద్యోగుల జఠిలమైన సమస్యను పరిష్కరించడానికి మాత్రం సమయం కేటాయించడం లేదు. అలాగని కొందరు మంత్రులు నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి  సమస్యలను తీసుకెళ్లినా.. అన్ని ప్రభుత్వశాఖల నుంచి దరఖాస్తులు వచ్చిన తరువాత చేద్దామని ప్రభుత్వంలోనే కొర్రీ వేసుకొని కూర్చున్నారు. కనీసం ముందుగా కొందరు మంత్రులు(పట్టణ పురపాలకశాఖ మంత్రి నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పోలీసుశాఖ అనిత) శాఖలకు చెందిన ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిశీలన చేసి  ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉంటే.. వారి శాఖల ఉద్యోగుల సమస్యల సమస్యలు పరిష్కారం అయ్యాయి.. మనశాఖ ఉద్యోగుల సమస్యల ను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే తపన ఇతర శాఖల మంత్రుల్లో వచ్చి ఉండేది. కానీ ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు.

-భారీగా ప్రయోజనాలు(BENEFITS) కోల్పోతున్న సచివాలయ ఉద్యోగులు
ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇతర 74ప్రభుత్వశాఖల(AP GOVT DEPTS) ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలను సైతం వీరు కోల్పోవాల్సి వస్తున్నది. అసలే రెండేళ్లకు జరగాల్సిన సర్వీసు రెగ్యులైజేషన్ తొమ్మిది నెలలు ఆలస్యంగా జరిగింది. అపుడు తొమ్మిది నెలలు పేస్కేలు కోల్పోయారు.. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం కలపాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కలపలేదు.. అవి, వాటితో వచ్చే అరియర్స్ కోల్పోయారు. గత ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీలో పెంచిన జీతం తప్పా ఇతర ప్రయోజనాలు ఏమీ సచివాలయ ఉద్యోగులు పొందలేదు. దానికోసం కూడా నేటి వరకూ ఎవరూ మాట్లాడనుకూడా మాట్లాడలేదు. పేరుకి సచివాలయ ఉద్యోగుల యూనియన్లు ఉన్నా.. వారికి ప్రధాన సమస్యలపై పోరాటాలు.. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలు తామూ పొందాలనే విషయంలో మాత్రం ముందుడుగు వేయడం లేదనేది నేటి వరకూ పరిష్కారం కాని ఉద్యోగుల ప్రధాన సమస్యలే తేటతెల్లం చేస్తున్నాయి. ఇపుడు కూడా సాధ్యమైనంత త్వరలో సచివాలయ ఉద్యోగులకు క్యాడర్, సర్వీస్ రూల్స్, మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ అలాట్ మెంట్ కాకపోతే ఇంకెంత నష్టపోవాల్సి వస్తుందో అర్ధంచేసుకోవచ్చు. 

అంతేకాకుండా ప్రస్తుతం ఇచ్చే ప్రభుత్వశాఖల్లో నిబంధనలు అనుకూలించకపోతే మళ్లీ మరో ఐదేళ్లో, ఏడేళ్లో.. లేదంటే ప్రభుత్వం అవకాశం కల్పించే వరకో పదోన్నతుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలా తోకా లేకుండా సచివాలయ శాఖ ఏర్పాటు చేసి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిందని అసెంబ్లీ సాక్షిగా చర్చకు తెరలేపిన కూటమి ప్రభుత్వం ఇపుడు అదే సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేసే విషయంలో, సమస్యలు పరిష్కరించే విషయంలో నిర్ధిష్ట విధివిధానాలు ఇంకా రూపొందించక కుండా చేస్తున్న ఆలస్యంపై ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. చూడాలి గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వమూ చేస్తుందా..లేదంటే సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల మదిరిగా అన్నిప్రయోజనాలు కల్పిస్తుందా..? అదీ కాదంటే సేవలకు మాత్రమే సచివాలయ ఉద్యోగులను వినియోగించుకొని సమస్యల పరిష్కారానికి కాలం వెల్ల దీస్తుందా..? అనేది..!

సిఫార్సు