గ్రామసచివాలయాల్లో వీడియోకాన్ఫరెన్సు..


Ens Balu
10
Velagapudi
2020-10-15 09:28:45

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వీడియోకాన్ఫరెన్సు విధానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు సీఎం వైఎస్ జగన్మోహ నరెడ్డి సంబంధిత శాఖల కార్యదర్శిలను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు నూతన భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తయిన వెంటనే బ్రాడ్ బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ తోపాటు, వీడియోకాన్ఫరెన్సు వ్యవస్థను అన్ని సచివాలయాల్లోనూ అమరుస్తారు. ఆ తరువాత గ్రామసచివాలయాల్లోని అన్ని శాఖల సిబ్బందితో జిల్లా కలెక్టర్ నుంచి ఇతర శాఖల జిల్లా అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా తాజా పరిస్థితిని తెలుసుకుంటారు. అంతేకాదు ఒక్కోసారి నేరుగా సమస్యలపై వచ్చిన ప్రజలతో కూడా మాట్లాడి సచివాలయం ద్వారా ఎలాంటి సేవలు అందుతున్నాయో నేరుగా అడిగి తెలుసుకుంటారు. దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థగా ప్రజలకు మరింతగా సేవలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వ చేపడుతన్న విధానం చాలా మంది ప్రజల నుంచి మన్ననలు పొందుతుంది. అయితే ఇక్కడ నియమించబడిన 11శాఖల సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో విఫలమవుతున్నవిషయం కూడా ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. ఈ సమస్యలను కూడా త్వరలోనే తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం విశేషం...