తిరుపతిలో 20ఏళ యువతిపై పాస్టర్ అత్యాచారం..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
తిరుపతి
                            2020-10-15 10:23:49
                        
                     
                    
                 
                
                    ఆంధ్రప్రదేశ్ లో ఫాస్టర్లు ప్రార్ధనల ముసుగులో అత్యాచారాలు పెరుగుతున్నాయి..మొన్న విశాఖజిల్లా గాజువాకలో ఒక పాస్టర్ ఒ యువతిపై అత్యాచారం చేయగా నేడు తిరుపతిలో మరోపాస్టర్ 20ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసుల్లో పోసు కేసులు తప్పా, చర్యలు లేకపోవడంతో రాష్ట్రంలో ఏదోమూల పాస్టర్ల అఘాయిత్యాలు పెచ్చు పెరుగుతున్నాయి. ఇక తిరుపతిలోని అఘాయిత్యానికి గురైన బాధితురాలి  తల్లి మీడియాకు తెలిపిన వివరాలు తెలుసుకుంటే... "తిరుపతిలో ఉండే పాస్టర్ దేవసహాయంకు చెందిన రెయిన్బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో గత నెల 4వ తేదీన మా పెద్దకుమార్తె పనికి చేరింది. అయితే ఈ నెల 3వ తేదీన దేవసహాయం కారులో వచ్చి సరుకు డెలివరీ ఇవ్వాలని, మా అమ్మాయిని తీసుకెళ్లాడు. అలా చెప్పి తీసుకెళ్లి రేణిగుంట రోడ్డులోని తుకివాకం గ్రామసమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మాయి ఇంటికి వచ్చాక మాకు ఈ ఘోరం గురించి తెలిసింది. దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దిశ పోలీస్ స్టేషన్కు వెళితే, వాళ్లతో మీరు పోరాటం చేయలేరని అన్నారు. మా అమ్మాయిని వేరే పని చేసుకోమని సలహా ఇచ్చారని తెలిపింది. దీంతో మేము స్పందన కార్యక్రమం ద్వారా ఈ ఘోరంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం" అని చెప్పారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదును అదనపు ఎస్పీ సుప్రజ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పంపారు. దీంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పలువురు విపక్ష నాయకులు పరామర్శించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్తో పాటుగా, టీఎన్ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ శ్రేణులు ధర్నాకు దిగాయి.