తిరుమల తిరుపతి దేవస్థానములచే అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో భారతకాల మానం ప్రకారం మంగళవారం వేకువ జామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. టీటీడీ అర్చకస్వాములు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం, సాంప్రదాయ బద్దంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఎపిఎన్ఆర్టి ఎస్ టీటీడీ, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలను సమన్వయం చేసుకుని కళ్యాణోత్సవం నిర్వహణలో పాలు పంచుకుంటోంది. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు.కళ్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీవారి కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.