వాట్సప్ గ్రూపుల ద్వారా ఎక్కువ మందికి సమాచారం తెలియజేయాలనుకున్నవారికి వాట్సప్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే గ్రూపు సభ్యుల సంఖ్యను 1560 పెంచుతున్నామంటూ ప్రకటన చేసిన వాట్సప్ ఆ ప్రక్రియ అందుబాటులోకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందనే సంకేతాలు విడుదల చేసిందనే వార్త ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. టెలీగ్రామ్ కి పోటీగా గ్రూపు సభ్యుల సంఖ్యను పెంచుతూ, మంచి మంచి ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న వాట్సప్ ఇటీవలే గ్రూపు సభ్యుల సంఖ్యను 256 నుంచి 560కి పెంచుతున్నట్టు ప్రకటించింది. కానీ అది అందుబాటులోకి రాకుండానే ఇపుడు మరో ప్రచారం వైరల్ అయ్యింది. అయితే వాట్సప్ మాత్రం అఫిషియల్ గా గ్రూపు సభ్యుల సంఖ్యను పెంచే విషయంలో టెలీగ్రామ్ కి పోటీగా మెల్ల మెల్లగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టెలీగ్రామ్ లక్షల మందితో గ్రూపుని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించగా దానికి పోటీగా ఒక్కో అడుగూ వేస్తూ వాట్సప్ కూడా తన వినియోగదారులకు గ్రూపు సభ్యుల సంఖ్యను పెంచుతున్నామంటూ ఆశలు కల్పించింది. ఇటీవలే సర్వర్ సమస్యతో సుమారు రెండు గంటల పాటు పనిచేయకుండా ఆగిపోయిన వాట్సప్ త్వరలోనే ఆ సమస్యలన్నింటినీ అధిగమించిన తరువాత గ్రూపు సభ్యుల సంఖ్య, గ్రూపు కాలింగ్ సభ్యుల సంఖ్యను పెంచనుందని సమాచారం అందుతుంది. అయితే అది జనవరి 2023 నాటికి వస్తుందా..లేదంటే ఇంకా సమయం పడుతుందా అనేది వాట్సప్ స్వయంగా ప్రకటించాల్సి ఉంది..!