సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి సిబ్బందికి చుక్కులు చూపిస్టున్నాడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ నుంచి వస్తున్న ఆశక్తి విషయాలు ప్రపంచమంతా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నిర్వాకాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఓవైపు పొదుపు చర్యలకు దిగుతూనే పారిశుధ్య సిబ్బంది వేతన పెంపుకు డిమాండ్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి వారందరినీ పీకిపడేశారు మస్క్. దాంతో సరైన నిర్వహణ కార్యాలయాల్లోని లేక బాత్రూములన్నీ భరించలేనంత కంపు కొడుతున్నాయని సిబ్బంది మొత్తుకుంటు న్నారు. చివరికి వాటిలో టాయిలెట్ పేపర్లకు కూడా దిక్కు లేదట! వాటిని ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. పలు నగరాల్లోని ట్విట్టర్ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా కరువయ్యారట! నిర్వహణ భారం తగ్గించుకు నేందుకు ఉద్యోగులందరినీ రెండంతస్తుల్లోనే కుక్కి నాలుగింటిని ఖాళీ చేశారట మస్క్. మరో పక్క సిబ్బందిని వీలై నంత వరకూ వర్క్ ఫ్రం హోం చేయాలని చెబుతున్నారట. కాగా టెస్లా.. స్పేస్ ఎక్స్.. తది తర సొంత కంపెనీల నుంచి సిబ్బందిని ట్విట్టర్ కు తరలిస్తుండటం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది..