పొరుగుదేశం పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీనితో దీంతో దేశవ్యాప్తంగా పొదుపు చర్య లను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇటీవల ఇంధన పొదుపు చర్యలను ప్రకటించిన ప్రభుత్వం ఇపు డు తాజాగా రాత్రి 8.30 గంటలకే మార్కెట్లను, 10 గంటలకు ఫంక్షన్ హాళ్లు మూసివేయాలని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఫిబ్రవరి నుండి బల్బుల తయారీని, జులై నుండి నాసిర కం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తామ ని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 30% విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర్వుల తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.