చీతాలను తెంచ్చేందుకు ద‌క్షిణాఫ్రికాతో ఒప్పందం


Ens Balu
21
Delhi
2023-01-27 13:16:13

భారతదేశంలో తిరిగి చీతాను (చిరుత‌) ప్ర‌వేశ‌పెట్టేందుకు ద‌క్షిణాఫ్రికా రిప‌బ్లిక్‌,  భార‌త రిప‌బ్లిక్ అవ‌గాహ‌నా ఒప్పందంపై ఈరోజు సంత‌కాలు చేశాయి. ఒప్పందం ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 2023లో తొలిబ్యాచ్‌గా 12 చిరుతల‌ను ద‌క్షిణాఫ్రికా నుంచి ఇక్క‌డ‌కు త‌ర‌లించ‌నున్నారు. ఇవి, 2022లో న‌మీబియా నుంచి భార‌త్‌కు తీసుకువ‌చ్చిన ఎనిమిది చిరుత‌ల‌తో క‌లిసి ఉంటాయి.  చిరుత‌లను పున‌రుద్ధ‌రించ‌డం కేంద్రం ప్రాధాన్యతగా తీసుకుంది‌. ఫిబ్ర‌వ‌రిలో 12 చిరుత‌ల‌ను దిగుమ‌తి చేసుకున్న అనంత‌రం, రానున్న ఎనిమిది నుంచి 10 ఏళ్ళ వ‌ర‌కు ప్ర‌తి ఏడాది 12 చొప్పున ఈ చిరుత‌ల‌ను తీసుకురావాల‌న్న‌ది ప్ర‌ణాళిక‌. 

ద‌క్షిణ ఆఫ్రికా జాతీయ జీవ వైవిధ్య సంస్థ (ఎస్ఎఎన్‌బిఐ), ద‌క్షిణాఫ్రికా జాతీయ పార్కులు (ఎస్ ఎ ఎన్ పార్కులు), ద‌క్షిణాఫ్రికాలోని చీతా రేంజ్ ఎక్స్‌పాన్ష‌న్  ప్రాజెక్ట్ అండ్ ఎండేంజ‌ర్డ్ వైల్డ్ లైఫ్ ట్ర‌స్ట్ (ఇడ‌బ్ల్యుటి)  స‌హ‌కారంతో అట‌వీ , మ‌త్స్య‌, ప‌ర్యావ‌ర‌ణ శాఖ (డిఎఫ్ఎఫ్ఇ), జాతీయ టైగ‌ర్ క‌న్స‌ర్వేష‌న్ అథారిటీ (ఎన్‌టిసిఎ),వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యుఐఐ) ఈ బ‌హుశాస్త్ర సంబంధిత అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌య ప‌రుస్తున్నాయి. భార‌త‌దేశంలో చిరుత‌ల‌ను తిరిగి ప్ర‌వేశ‌పెట్ట‌డంపై అవ‌గాహ‌న ఒప్పందం (ఎంఒయు)  భార‌త‌దేశంలో ఆచ‌ర‌ణీయ‌, సుర‌క్షిత‌మైన చిరుత జ‌నాభాను ఏర్ప‌ర‌చేందుకు ఇరు పార్టీల మ‌ధ్య స‌హ‌కారాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డ‌మ కాక ప‌రిర‌క్ష‌ణ‌ను ప్రోత్స‌హిస్తుంది. అవ‌గాహ‌నా ఒప్పందం ప్ర‌కారం, సాంకేతిక‌త‌లు, నిర్వ‌హ‌ణ‌లో వృత్తినిపుణుల‌కు శిక్ష‌ణ‌, విధానం, విజ్ఞానం బ‌దిలీ ద్వారా భారీగా కార్నివోర్ (మాంసాహారం తీసుకునే జంతువుల‌)  ప‌రిర‌క్ష‌ణ‌తో పాటుగా, ఇరు దేశాల మ‌ధ్య స్థానాంత‌ర‌ణం చేసిన చిరుత‌ల ద్వైపాక్షిక సంర‌క్ష‌ణ‌ను ఏర్పాటు చేయ‌డం కోసం ఇరు దేశాలు స‌హ‌క‌రించుకుంటాయి. అంతేకాకుండా ప్ర‌తి ఐదేళ్ళ‌కు ఎంఒయులోని అంశాల‌ను అది స‌హేతుకంగా ఉండేందుకు స‌మీక్షిస్తారు.