ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా ఆ లోటును భర్తీచేసుకునేందుకు పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటింటికి పంపేస్తున్నాయి. తాజా 12,000 మందిని గూగుల్ ఉద్యోగులను తొలగించనున్నట్టు సంస్థ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. కొలువు లు కోల్పోయిన అమెరికన్ ఉద్యోగులకు ఇప్పటికే ఈమెయిల్స్ పంపించారు. మాస్ లేఆఫ్స్లో భాగంగా కంపెనీలో 6% ఉద్యోగులను విధుల నుంచి తప్పించారు. జాబ్స్ కోల్పోయిన ఉద్యోగులకు తగిన పరిహార ప్యాకేజ్ చెల్లిస్తామని పిచాయ్ చెప్పారు. 16 వారాల వేతనంతో పాటు పలు ప్రయోజనాలను వర్తింపచేస్తామని ప్రకటించారు. గుగూల్ లాంటి సంస్థలో ఉద్యోగం అంటే చాలామంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రాజభోగంగా భావిస్తారు. కానీ ఇపుడు అదే గుగూల్ సంస్థ ఉద్యోగులను క్రమేపీ తగ్గిస్తుండటం చర్చనీయాంశ అవుతోంది.