టర్కీ, సిరియా దేశాల సరిహద్దులో ఈతెల్లవారుజామున అతి శక్తివంతమైన భూకంపం సంభవించిన నేపథ్యంలో దాని ప్రభావానికి టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటికే 650 మందివరకూ మరణించినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య దాదాపు పది వేలకు చేరే అవకాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. కాగా, భవన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసే పనిలో సహాయక సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఎప్పటికప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు మృతదేశాహాలో ఆ ప్రాంతం శోకసంద్రమైంది.