టెలీగ్రామ్ కి పెరుగుతున్న ఆదరణ..
Ens Balu
2
Mumbai
2020-10-11 17:32:56
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా యాప్ టెలీగ్రామ్ కి ఆధరణ క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వ అధికారులు, రాజకీయపార్టీలు అన్నీ టెలీగ్రామ్ గ్రూపును అధికంగా వినియోగిస్తున్నాయి. టెలీగ్రామ్ గ్రూపు ద్వారా అత్యధిక మంది సభ్యులను చేర్చేకునే వీలుండటంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అత్యధికంగా ఈ యాప్ ను జర్నలిస్టులు అధికంగా వినియోగిస్తున్నారు. వాట్సప్ కంటే, టెలీగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు క్వాలిటీ చెక్కుచెదరకుండా రావడమే దీనికి ప్రధాన కారణం. దానికతోడు, వాట్సప్ లో 250 మందికి మించి సభ్యులను చేర్చుకునే అవకాశం లేకపోవడం కూడా టెలీగ్రామ్ యాప్ ని అందరూ వినియోగించడానికి కారణం అవుతోంది. ఒకప్పుడు టెలీగ్రామ్ యాప్ ని అందరూ వినియోగించాలని భారీ స్థాయిలో ప్రచారం జరిగినా, ఎవరూ దానిని సద్వినియోగం చేసుకోలేదు. రాను రాను దాని యొక్క ఉపయోగాలు తెలియడంతో ప్రస్తుతం దీనిని 500 మిలియన్లకు పైగా వినియోగిస్తున్నారు. ఇక వాట్సప్ ను 5బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఇటీవల టెలీగ్రామ్ లో కూడా వీడియోకాలింగ్ చక్కని క్వాలిటీతో రావడంతో, గ్రూపు సభ్యుల్లో ఎవరైనా గ్రూపులోకి ఇతర సభ్యులను యాడ్ చేసే అవకాశం వున్నందున ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు అధికంగా ఈ టెలీగ్రామ్ యాప్ ను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నాయి. అటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఎక్కువగా టెలీగ్రామ్ యాప్ వినియోగిస్తుండటంతో ప్రతీ మొబైల్ లోనూ వాట్సప్ తోపాటు, ఇపుడు టెలీగ్రామ్ యాప్ కూడా కనిపిస్తుంది. దానికితోడు త్వరలో గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తుందనే ప్రచారం జరగడంతో ఇనిస్టాల్స్ మరింతగా పెరుగుతున్నాయి. అటు టెలీగ్రామ్ వెబ్ ద్వారా సిస్టమ్ కి కనెక్ట్ చేసుకొని సందేశాలు ల పంపుకోవడానికి ఈ యాప్ వాట్సప్ కంటే ఎంతో అనువైనదిగా వుంటుంది..