కీసర తహశీల్దార్ రూ.1.10 కోట్ల విషయం గిన్నిస్ బుక్ లోకి...
Ens Balu
3
Keesara
2020-08-26 18:52:41
ప్రపంచంలోనే రూ..1.10కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోయిన తెలంగాణలోని కీసర తహశీల్దార్ ఘటనపై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్పందించింది. 20 మిలియన్ డాలర్ల లంచం ప్రపంచంలో ఇదే ప్రథమమని..పేర్కన్న గిన్నిస్ బుక్ ఈ రికార్డ్ ని నమోదుకు ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించింది..ఓ ప్రభుత్వ ఉద్యోగి, దాదాపు 20 మిలియన్ డాలర్లు లంచం స్వీకరిస్తూ, పట్టుబడటం ఇదే తొలిసారని, ఆయన పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండుస్వచ్చంద సంస్థలు గిన్నిస్ రికార్డు అధికారులను కోరారు. ఇప్పటివరకూ ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన కేటగిరీ లేదని, దీనికోసం ఓ కొత్త కేటగిరీని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని గిన్నిస్ ప్రతినిధులు తెలియజేశారని జ్వాల సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ప్రశాంత్ తెలిపారు. మొత్తానికి లంచం తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం గిన్నిస్ బుక్ రికార్డు ద్రుష్టిలో పడటం వైరల్ అవుతుంది...