అప్పన్నకు ఎన్నారై చందన సమర్పణ..
Ens Balu
5
Simhachalam
2021-07-03 12:53:07
సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారికి కాలిఫోర్నియాలో సెటిలైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సునీత శనివారం అరకేజీ చందనం సమర్పించారు. ఈ మేరకు ఈఓ అకౌంట్ లోకి రూ.10,116 పంపారు. తన తల్లి, పిల్లలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తమ పెద్ద పాపకు చర్మ సమస్య ఉందని, అమెరికాలో ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా తగ్గలేదని, అందుకే స్వామివారి దర్శనానికి వచ్చి చందనం సమర్పించామని ఆమె తెలిపారు. స్వామివారి ప్రసాదం చందనం ముక్కను అరగదీతి తన కుమార్తెకు పూస్తామని ఆమె వివరించారు. తెలిపారు. స్వామివారికి రోజూ పూజచేస్తున్నామన్నారు. అంతకు ముందు ఏఈఓ రాఘవ కుమార్ నుంచి చందనం చెక్కను ప్రసాదంగా అందుకున్నారు.