సాగర జలాలపై వీరోచితంగా ఇంద్రానేవి 2020 కవాతు...
Ens Balu
2
Bay of Bengal
2020-09-04 16:11:32
రెండవ ప్రపంచ యుద్దంలో గెలుపుకి చిహ్నంగా నిర్వహిస్తున్న11వ ఓడల కవాతు బే ఆఫ్ బెంగాల్ సెప్టెంబరు 4 నుంచి 5వ రకూ జరుగుతుందని ఇంద్రానేవి 2020 (ఇండియన్, రష్యా నేవి) పేర్కొంది. ఈమేరకు ఇరు దేశాలకు చెందిన నేవీ తమ కవాతు ఎంతో వీరోచితంగా ప్రదర్శిస్తున్నాయి. ఈ నావికా కవాతు ద్వారా భారత్, రష్యా నేవీ యొక్క సామర్ధ్యాలను, స్నేహ సంబధాలను ప్రదర్శించడం ద్వారా తమ బలాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి అవకాశం వుంటుందని ఇదరు దేశాల నేవీలు ప్రకటించాయి. అంతేకాకుండా ఇరుదేశాల నేవీ మధ్య ద్వైవార్షిక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం మరింత బలపడుతందని అభిప్రాయ పడింది. కాగా ఈ కవాతులో భారత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పాల్గొవలసి ఉండగా ఆయన ప్రస్తుతం మాస్కో పర్యటనలో ఉన్నారు. అయినప్పటికీ రెండ ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా సాధించిన విజయానికి, జరుగుతున్న కవాతుకి తన సంఘీభావం తెలియజేశారు. కాగా భారత ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ 19 నిబంధనల మేరకు సముద్ర జలాలపై నిర్వహిస్తున్నారు. భారత నావికాదళానికి చెందిన హెలికాప్టర్లతో పాటు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ రణవిజయ్, స్వదేశీ యుద్ధనౌక సహ్యాద్రి, ఫ్లీట్ ట్యాంకర్ శక్తి తన కవాతను ప్రదర్శించినట్టు నావికా దళం ప్రకటించింది.