ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సచివాలయ వ్యవస్థ వినూత్నంగా, ఆదర్శంగా ఉందని, సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న తీరు అద్భుతమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకా మేరీ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అమలు తీరును అధ్యయనం చేసేందుకు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం తరఫున కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకా మేరీ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. కమిషనర్ తో పాటు మరో ఐఏఎస్ అధికారి ,బళ్లారి జిల్లా పరిషత్ సీఈవో నందిని, పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం డైరెక్టర్ రేవణప్ప, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ యాలక్కి గౌడ, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ జాయింట్ డైరెక్టర్ గణేష్ ప్రసాద్,పంచాయతీ అభివృద్ధి అధికారులు,ప్లానింగ్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ అధికారులు మొత్తం 10 మంది ఈ బృందంలో ఉన్నారు. సోమందేపల్లి మండలంలో గ్రామ సచివాలయం -3, చిలమత్తూరు గ్రామ సచివాలయం-1, రైతు భరోసా కేంద్రాలను అధికారుల బృందం పరిశీలించింది. సచివాలయ వ్యవస్థ, పనితీరును తెలుసుకుని వారు ఆశ్చర్య పోయారు.. ఒక గ్రామ సచివాలయంలో ఇంత మంది పనిచేస్తున్నారా అని వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు.. పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్ఎం, అగ్రికల్చరల్ అసిస్టెంట్, హార్టికల్చరల్ అసిస్టెంట్,విఆర్వో, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, గ్రామ వాలంటీర్ల తో మాట్లాడారు.. వారు ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నా రో అడిగి తెలుసుకున్నారు..
సేవలు అద్భుతం..ప్రజలకు ఉపయోగకరం.. గ్రామ,వార్డ్ సచివాలయ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ అని, లక్షల మంది యువత ఈ వ్యవస్థ లో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించడం తమని బాగా ఆకట్టుకుందంటూ స్పందించారు. ఈ వ్యవస్థ అద్భుతంగా ఉందని, ప్రజలకు చాలా ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు. మండలాలకు,జిల్లా కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలు అందించడం చాలా బాగుందని కితాబిచ్చారు.
సాఫ్ట్వేర్ అద్భుతం.. నిర్దేశించిన గడువు లోపే సేవలందించేలా సీఎం స్థాయి వరకు పర్యవేక్షిస్తున్న విధానం, అందుకోసం రూపొందించిన సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సచివాలయ పరిధిలో ఉన్న కుటుంబాల డేటా సేకరణ, మ్యాపింగ్ ఎలా చేశారు, సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, కంప్యూటర్స్ తదితర అన్ని అంశాల గురించి జాయింట్ కలెక్టర్ ( గ్రామ,వార్డ్ సచివాలయాలు, అభివృద్ధి) ఏ.సిరి తో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు..సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణ కయ్యే ఖర్చు, సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు తదితర అన్ని అంశాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు..కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమలు చేయాలన్న ఆలోచనతో ఉందని, అందువల్లే సచివాలయ వ్యవస్థ పనితీరును గురించి తెలుసుకునేందుకు అనంతపురం జిల్లాలో పర్యటించామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బృందం వెంట డిపివో పార్వతి ఉన్నారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (ఎస్ఎల్ఎస్) లో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ (2018-20) పూర్వ విద్యార్థిని మనసా నారాయణ్ ఇటీవల జర్మనీలోని వర్జ్బర్గ్ విశ్వవిద్యాలయంలో విస్సెన్స్చాఫ్ట్లిచ్ మితార్బీటెరిన్ (రీసెర్చ్ ఫెలో) గా చేరారు. ఇన్స్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ ఇన్ఫెక్షన్ బయాలజీ (http://www.imib-wuerzburg.de/imib/) విశ్వవిద్యాలయంలో "హెలికోబాక్టర్, క్యాంపిలోబాక్టర్లలో రిబోరేగ్యులేషన్లో పాల్గొన్న RNA బైండింగ్ ప్రోటీన్ల యొక్క ఫంక్షనల్ క్యారెక్టరైజేషన్" అనే అంశంపై మనసా పిహెచ్డి చేయనున్నారు. దానికిగాను 2164 యూరో లు నెలవారీ జీతం అందుకోనున్నారు. మనసా తన ఎంఎస్సి థీసిస్ కోసం ప్రొఫెసర్ షర్మిస్తా బెనర్జీ (ఎస్ఎల్ఎస్, యుఒహెచ్) తో కలిసి పనిచేశారు. ఆమె వరుసగా 2019, 2020 సంవత్సరాల్లో CSIR-NET, GATE అర్హత సాధించిండంతోపాటు. ఆమె భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి) చేత ఉన్నత విద్యలో (2015 నుంచి 2020 వరకు) ఇన్స్పైర్ స్కాలర్షిప్ గ్రహీతగా కూడా ఉన్నారు.
భారతదేశంలోని యూట్యూబ్ ఛానల్స్ నియంత్రణ చేసేందుకు కేంద్రం తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉండబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు సమాచార మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నట్టు జరుగుతున ప్రచార సమాచారం మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న శాటిలైట్ టివీ ఛానల్స్ కున్న యూట్యూబు ఛానల్స్ కూడా రద్దు అవుతాయని తెలుస్తోంది. ఒక వేళ శాటిలైట్ టీవిఛానల్స్ కి యూట్యూబు ఛానల్స్ కావాల్సి వచ్చిన క్రమంలో శాటిలైట్ ఛానల్ మాదిరిగానే(కొద్దిపాటి నిబంధనలు టివిలకు మాత్రమే సవరించి) వాటికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలట. ఇక ఇబ్బడి ముబ్బడిగా జీమెయిల్ అకౌంట్ యూట్యూబు ఛానల్స్ పెట్టేస్తున్నవారిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఫార్మాట్ ను రూపొందింస్తుందని తెలుస్తుంది. ఆ ఫార్మాట్ ప్రకారం ఎవరైనా యూట్యూబు ఛానల్ పెట్టుకోవాలంటే సుమారు రెండు నుంచి 3లక్షల రూపాయల వరకూ ఖర్చు కానుందట. దానికి ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు శాటిలైల్ ఛానల్స్ ఏ తరహాలో అయితే అనుమతులు పొందాయో అదే తరహాలో అనుమతులు తీసుకోవాల్సి వుంటుందని సమాచారం. దానికోసం ఇప్పటికే కేంద్రం ఫర్మ్, ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్, లేబర్ లైసెన్స్, పోస్టల్ లైసెన్స్, లోగో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, లోకల్ పోలీసు నుంచి తనపై కేసులేమీ లేనట్టుగా ఎన్ఓసి, కనీసం ఐదేళ్ల జర్నలిస్టుగా అనుభవం, కరెంట్ అకౌంట్, జీఎస్టీ, పాన్ కార్డ్, ఛానల్ నిర్వహణకు కావాల్సిన ఎక్విప్ మెంట్(పరిశీలనలో చూపే విధంగా) ఉద్యోగులందరికీ సాలరీలు ఇచ్చేలా కరెంటు అకౌంట్, ప్రతీ మూడు నెలలకు జీఎస్టీ రిటర్న్స్, ఛానల్ నిర్వహణకు కనీసం 3 వీడియో కెమెరాలు, కనీసం మూడు కంప్యూటర్లు, ముగ్గురు సిబ్బంది, ఇలా చాలా రకాలుగానే నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా యూట్యూబు ఛానల్ లైసెన్సు పొందడానికే చలానా ఖరీదే రెండు లక్షలు దాటి ఉంటే 60శాతం యూట్యూబు ఛానల్స్ ని నియంత్రించ వచ్చునని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ కాకపోయినా, కనీసం యూట్యూబు ఛానల్ ఏర్పాటుకి రూ.25 వేల నుంచి 50వేల రూపాయల ఫీజు విధించినా 40శాతం ఛానల్స్ మొత్తం నియంత్రణ జరుగుతాయని సీనియర్ యూట్యూబర్స్ పేర్కొంటున్నారు. ముఖ్యంగా యూట్యూబు ఛానల్ ఏర్పాటు చేయాలంటే కనీస అనుమతులు, కనీస ప్రభుత్వ ఫీజులు ఉండాలనే నిబంధనను 60శాతం మంది ఏకీభవించడం విశేషం..