భారత ప్రభుత్వవిభాగాలలో, భారతీయ రైల్వేలోని ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు తీసుకోవలసిన చర్యలపై రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతీయ రైల్వేలలో అవినీతి రహిత, పారదర్శక ప్రొక్యూర్మెంట్ విధానం ఉన్నదన్న విశ్వాసం పరిశ్రమ వర్గాలలో కల్పించాలని సూచించారు.
ప్రోక్యూర్మెంట్ ప్రక్రియలో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులును ప్రోత్సహించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షిస్తూ ఆయన, ప్రోక్యూర్ మెంట్ ప్రక్రియలో స్థానిక వెండర్లు పాల్గొనడాన్ని పెంచేలా చూడాలని నొక్కి చెప్పారు. స్థానిక వెండర్లు, సరఫరా దారుల నుంచి మరిన్ని బిడ్లు వచ్చే విధంగా ప్రొక్యూర్ మెంట్ నిబంధనలలో స్థానిక కంటెంట్ క్లాజు ఉండాలని నిర్ణయించారు.ఇది ఆత్మనిర్భర్భారత్ మిషన్కు మరింత ఊపు నివ్వనుంది. ఈ దిశగా భారతీయ రైల్వే కృషి చేసేందుకు వీలుగా అవసరమైతే డిపిఐఐటిని విధానపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా కోరి దాని మద్దతు తీసుకోవాలని అన్నారు.
స్థానికంగా తయారయ్యే వస్తువులను ఎవరు ఎక్కువగా సరఫరాచేయగలుగుతారో అలాంటి వెండర్లకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రొక్యూర్మెంట్ ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలపై వెండర్లకు స్సష్టత వచ్చేందుకు హెల్ప్ లైన్ నెంబర్, తరచూ అడిగే ప్రశ్నలు, సమాధానాల సెక్షన్ను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగింది.
మేక్ ఇన్ ఇండియాను పెంపొందించడం, జిఇఎం ద్వారా వివిధ ఉత్పత్తులు సేకరించడానికి తీసుకుంటున్న చర్యలు ,ఈ దిశగా జరిగిన పురోగతి తదితర విషయాలపై రైల్వే బోర్డు మెటీరియల్స్ మేనేజ్ మెంట్ సబ్యుడు సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి రైల్వేశాఖ సహాయమంత్రి శ్రీ సురేష్ సి అంగడి, రైల్వేబోర్డు సభ్యులు, సిఇఒ, జిఇఎం, వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన డిపిఐఐటి ప్రతినిధులు హాజరయ్యారు.
భారతదేశ వర్తక, విదేశీ పెట్టుబడులే ప్రధాన అంశంగా ప్రధానమం త్రి నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 గురించి గురువారం ఆన్లైన్లో ప్రసంగిస్తారు. దీనిని బ్రిటన్ నిర్వహిస్తోంది. కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో దేశం అంది స్తోన్న రాయితీలు, పెట్టుబడులు పెట్టే వారికి అవకాశాల గురించి ప్రస్తావిస్తారు.సమావేశాలు మూడురోజులు జరగుతు న్నాయి. ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు జై శంకర్, పీయూ ష్ గోయల్, హర్దీప్ సింగ్ పురీ, రవిశంకర్ ప్రసాద్, మహేంద్ర నాథ్ పాండే తదితరులు కూడా ప్రసంగిస్తారు. బ్రిటన్ నుంచి ప్రిన్స్ చార్లెస్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు. తర్వాత విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్, హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్ హంకాక్ ఇతరులు మాట్లాడతారు. భారతదే శంతో ద్వైపాక్షిక సంబంధాలు.. బ్రెగ్జిట్ తర్వాత మెరుగైన సంబంధాల గురించి చర్చకొచ్చే అవకాశం ఉంది. హలీవుడ్ నటుడు కునాల్ నాయర్, ఇషా ఫౌండేషన్ ఫౌండర్ సద్దురు, జర్నలిస్ట్ బర్ఖా దత్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ కూడా పాల్గొని.. ప్రసంగిస్తారు. శిఖరాగ్ర సమావేశంలో 250 మంది వ్యాపారవేత్తలు సహా ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొంటారు.
యువ రచయిత రాజ్ కుమార్ స్వయంగా రాసి పాడిన కైలాస కొండలపై గణపతిదేవా సాంగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వరంగల్ కి చెందిన రాజ్ కుమార్ సినిమా ఆర్టిస్ట్ గానూ, కవిగానూ, నేను పాటల రచయితగా కూడా బాగా రాణిస్తున్నారు. ఈ తరుణంలో తన పాఠల రచనను తొలిగా గణపతి తోనే పాడి అలరిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజ్ కుమార్ రచనలకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ లోగోను మార్పు చేసినట్టు విశాఖలోని ఈఎన్ఎస్ ఆపరేషన్స్ ప్రధాన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. కొత్తగా మారిన లోగోతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సంస్థల వార్తలు స్వీకరిస్తుందని పేర్కొంది. పాత లోగోతో ఎంటరైటైన్ మెంట్ కార్యక్రమాలు, ప్రత్యేక స్టోరీలు నిర్వహిస్తుందని తెలియజేసింది. నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ కి అనుగుణంగా ఎలక్ట్రానిక్ మీడియా వార్తల కోసం లోగోలో ఈ మార్పులు చేసినట్టు ఈఎన్ఎస్ నెట్వర్క్ ఇన్ ఛార్జ్ పి.బాలభాను(బాలు) ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, ఎఫ్ఎం రేడియో చానళ్లు subscripitions కోసం విశాఖలోని ప్రధాన కార్యాలయంలో గానీ 9490280270, 9390280270, సంస్థ అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net లో గాని సంప్రదించవచ్చునన్నారు.
లదాఖ్ సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా మధ్య తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చైనా గాల్వన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకోవడం.. డ్రాగన్ కంట్రీ అత్యుత్సాహాన్ని బయటపెట్టింది. చైనా వివాదాస్పద తీరును ని