1 ENS Live Breaking News

ఏపీ లెజిస్లేచర్ లో ’గీతం‘ బిల్లు రద్దు దిశగా..

ఒక ప్రైవేటు యూనివర్శిటీ ఏర్పాటు కావాలంటే అండర్ సెక్షన్  3 యూజిసి యాక్టు 1956 ప్రకారం (గతంలో 100 ఎకరాలు భూమి, ఇపుడైతే 50 ఎకరాల భూమిలో అనుమతిస్తున్నారు అదీ పది కాలేజీలు,  ఆచార్యుల క్వార్టర్స్, విద్యార్ధుల హాస్టల్స్, క్రీడామైదానం, ల్యాబులు, పరిశోధన ప్రదేశాలు, జువాలజీ గార్డెన్) ఉండాలి. అదీ సదరు భూమిలో ఎలాంటి ఆక్రమణలు, లిటికెంటులు ఉండటానికి వీల్లేదు. అలాంటి  క్లీన్ చిట్ వున్నభూమి ఉందని, ప్రభుత్వ యూనివర్శిటీలతో పాటు ప్రైవేటు యూనిర్శిటీల అవసరం ఉందని సదరు విద్యాసంస్థను యూనివర్శిటీ మార్పుచేయడానికి తొలుత మంత్రి మండలిలో ఆమోదం తెలిపిన తరువాత ఏపి లెజిస్లేచర్(శాసన సభ)లో బిల్లు పాస్ చేయడానికి ప్రవేశపెడతారు, పాసైన బిల్లుతోపాటు, ప్రైవేటు యూనివర్శిటీ ఏర్పాటు చేయబోయే సంస్థ యొక్క ఫైలుపై అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సంతకం చేస్తారు. వాటిని యూజిసికి అనుమతి కోసం పంపుతుతారు. నేరుగా ప్రభుత్వం ఆమోందించిన ఫైలును పరిశీలించిన యూజీసి ప్రతిపాదిత విద్యాసంస్థలను ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీలుగా మార్చుకునేందుకు అనుమతి ఇస్తుంది. సరిగ్గా ఇపుడు అదే విధానాన్ని అవలంభించి భూ దురాక్రమిత ప్రైవేటు గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ విషయంలో కూడా ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపి, గీతం రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అంటే ముల్లుని ముల్లుతోనే తీయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.  విశాఖలోని రుషికొండ ప్రాంతంలో సుమారు 40.50 ఎకరాల ప్రభుత్వ భూమిని దురాక్రమించిన గీతం తన  విద్యాసంస్థలను ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీగా(13.08.2007)న మార్చుకుంది విద్యాసంస్థల యాజమాన్యం. అటు యూజిసికి, ఇటు ఎన్ఎంసీకి, ఏఐసిటిఈకి, నేక్ కి ప్రభుత్వ భూమిని ఆక్రమించి మరీ, తమ భూములుగా చూపించి అన్ని రకాల అనుమతులు పొందిన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీపై అదే లెజిస్లేచర్ లో రద్దు బిల్లు పెట్టడం ద్వారా యూనివర్శిటీ గుర్తింపును రద్దు చేయడానికి అవకాశం వున్నందున ఆ విధానాన్ని పాటించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే అక్రమాస్తులతో గుర్తింపులు తెచ్చుకొని అటు కేంద్రంప్రభుత్వ సంస్థలను, ఇటు విద్యార్ధుల భవిష్యత్తుతో వ్యాపారం సాగించిందనే సాంకేతిక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి గీతం అవినీతిని విధాన సభ ముందు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. అంటే ఈరకంగా.. గీతం విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు పెట్టే సమయానాకి ఏ ప్రభుత్వం లెజిస్లేచర్ లో బిల్లు పెట్టింది, ఎలాంటి మినిట్స్ తో బిల్లు పెట్టింది, బిల్లు పెట్టే సమయానికి గీతం విద్యాసంస్థలును యూనివర్శిటీగా మార్చుకోవడానికి ఎన్ని ఎకరాల సొంత భూమిని అనుమతులకోసం చూపించారు, చూపిస్తే ఆ భూమి ఏ సర్వేనెంబర్లలో చూపించారు, ప్రస్తుతం గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ ఎన్ని ఎకరాల భూమిలో విస్తరించి వుంది,  తదితర వివరాలన్నీ తీసుకొని, ఆపై ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి వివరాలతో ఒక ప్రత్యేక ఫైలుతో ప్రైవేటు బిల్లు తయారు చేసి, దానిని లెజిస్లేచర్ లో రద్దు బిల్లును ఆమోదించి, ఆపై అదే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కూడా యూజిసికి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అంటే ఏదైతే లేని భూమిని ఉన్నట్టుగా చూపి అనుమతులు పొందిందో...అవే భూములు గీతంవి కావని, దురాక్రమించినవని ప్రభుత్వం అసెంబ్లీలో కూడా రుజువు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తమవికాని చూపించినపుడు యూజిసి యూనివర్శిటీగా అనుతించినపుడు, చూపించిన భూముల్లో అగ్రభాగం ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు రుజువైన సమయంలో యూజిసి గీతం కి ఇచ్చిన గుర్తింపుని రద్దు చేయాల్సి వుంది. ఒక్కసారి ఏపీ లెజిస్లేచర్ లో ప్రైవేటు యూనిర్శిటీల రద్దు బిల్లు పాసైతే మళ్లీ గీతం అనుకూలిత ప్రభుత్వం వచ్చేవరకూ గీతంకు యూజిసి అనుమతులు గాలిలో ఉండాల్సిందేనని విద్యావేత్తలు చెబుతున్నారు. అదీ అప్పటికి సదరు యూనివర్శిటీకి సొంత భూములుంటే...ఇపుడు ఆ పరిస్థితి లేదు. ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన ఆక్రమిత భూముల్లో పక్కానిర్మాణాలు చేసింది వాటిని స్వాధీనం చేసుకునే సమయంలో గీతం కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. గీతం యూజిసిని కూడా విద్యార్ధుల భవిష్యత్తు డ్రామాతో మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుందనే సమాచారంతో ప్రభుత్వం యూనివర్శిటీల ఏర్పాటు బిల్లు ద్వారానే రద్దు బిల్లు కూడా పెట్టి గీతంకి చరమగీతం పాడటానికి పక్కాగా ఆధారాలు సేకరిస్తుందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే యూజిసి గీతంని వెనుకేసుకు వచ్చినా...ఇటు లెజిస్లేచర్, అటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ద్వారా ఆ బిల్లు రద్దు అయితే గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీకి యూజితోపాటు, ఏఐసిటిఇ, ఎన్ఎంసీ, నాక్ గుర్తింపులన్నీ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏంజరుగుతుందనేది భూ దురాక్రమిత గీతం తెరపై చూడాల్సిందే..!

Velagapudi

2020-11-16 12:28:11

2020-11-16 10:25:26

2020-11-16 10:23:14

2020-11-14 21:02:10

ఐదురోజులుగా ఐదు లక్షల లోపుగానే..

భారత్ లో చికిత్సపొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ 5 లక్షల లోపే ఉండటం వరుసగా ఐదో రోజు కూడా కొనసాగుతోంది. ఈరోజుకు భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య మరింత తగ్గి 4,80,719 గా నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్ కెసులలో చికిత్సపొందుతున్నవారి వాటా  మరో 5.48% తగ్గింది.  ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసులకంటే కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉండటం చూస్తున్నాం.  గత 24 గంటలలో 44,684 కొత్త పాజిటివ్ కేసులు రాగా,  47,992 మంది కోలుకున్నారు. ప్రజలు కోవిడ్ కు తగినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ నడుచుకుంటున్నారనటానికి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు తీసుకుంటున్న నియంత్రణ చర్యలు పటిష్ఠంగా ఉన్నాయనటానికి  నిదర్శనంగా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ఐదు వారాలకాలంలో కొత్త కేసుల సంక్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ధోరణి కోలుకున్నవారి శాతం ఈరోజు 93% దాటటానికి దోహదపడింది. మొత్తం జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 93.05% అయింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 81,63,572 కు చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య అంతరం క్రమంగాపెరుగుతూ ప్రస్తుతం 76,82,853 కు చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 75.38% మంది పది రాష్టాలకు చెందినవారే ఉండటం గమనార్హం. వారిలో ఢిల్లీలో అత్యధికంగా  6,498 మంది, ఆ తరువాత కేరళలో 6,201 మంది, మహారాష్ట్రలో  4,543 మంది కోలుకున్నారు. అదేవిధంగా కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 76.38% పది రాష్ట్రాలకు చెందినవే కాగా ఢిల్లీలో గత 24 గంటలలో  అత్యధికంగా  7,802 కేసులు, కేరళలో 5,804, మహారాష్ట్రలో  4,132 కేసులు నమోదయ్యాయి. కాగా గత 24 గంటలలో 520 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వీరిలో  79.23% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  తాజా మృతులలో 24.4% (127 మరణాలు) ఒక్క మహారాష్ట్రలోనే నమోదుకాగా 91 మందితో ఢిల్లీ, 51 మందితో పశ్చిమ బెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. 

New Delhi

2020-11-14 16:46:19

గీతం యూజీసి అనుమతిపై వివరణ కోరిన ఈఎన్ఎస్..

విశాఖలోని రుషికొండ ప్రాంతంలోప్రభుత్వానికి చెందిన రూ.800 కోట్లు విలుచేసే 40.50 ఎకరాల రెవిన్యూభూమిని దురాక్రమణ చేసిన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ యూజీసి అనుమతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయమై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, యూజీసి చైర్మన్ ఆచార్య దీరేంద్రపాల్ సింగ్ ను మెయిల్ ద్వారా వివరణ కోరింది. ఈ మేరకు శనివారం ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ బాలు యూజిసి చైర్మన్ కి మెయిల్ చేశారు. ఇదే మెయిల్ లో ఇప్పటికే గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ విషయంలో రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ఆధారాలతో పాటు రాసిన లేఖపై మీ స్పందన ఏంటనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా గీతం ప్రభుత్వానికి చెందిన భూముల్లో భవనాలు నిర్మించి వాటిని యూజిసికి చూపిస్తే ఇచ్చిన అనుమతుల విషయం దేశవ్యాప్తం అయితే యూజిసికి పరువు నిలబడుతుందా అనే విషయాన్ని అడిగారు. గీతం విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఆక్రమణలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతోపాటు, అక్కడ ప్రభుత్వ స్వాధీన బోర్డలు కూడా ఏర్పాటు చేసింది. ఆ తరువాత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇటు యూజిసి, ఎంఎంసి, నేక్ లకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై ఎలాంటి స్పందన లేకపోవడంతో నేరుగా మాట్లాడానికి వీలులేని యూజిసి చైర్మన్ వివరణ కోసం ఈఎన్ఎస్ ఈమెయిల్ ద్వారా వివరణ కోరింది. ఆది నుంచి గీతం విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గీతం భూ దురాక్రమణలు తదితర అంశాలపై ఈఎన్ఎస్ ఆధారాలతోనే న్యూస్ కార్డ్ ప్రచురిస్తూ వస్తుంది. ఆ క్రమంలోనే ఈసారి నేరుగా యూజిసి చైర్మన్ ఆచార్య దీరేంద్రపాల్ సింగ్ వివరణ తీసుకోవడం ద్వారా ఆయనిచ్చే లికిఖిత పూర్వ వివరణపై వాస్తవాలను అటు ప్రజలకు, ఇటు యూనివర్శిటీలోని విద్యార్ధులకు తెలిసేలా వార్తా కధనాలు అందించాలని ఈఎన్ఎస్ భావిస్తోంది. ఆ క్రమంలోనే నేరుగా యూజీసీ చైర్మన్ ను మెయిల్ ద్వారా వివరణ కోరింది. ఈఎన్ఎస్ మెయిల్ రిప్లై వచ్చిన దానిని బట్టి తరుపరి వార్తాకధనాలు అందించాలని కూడా ఈఎన్ఎస్ భావిస్తుందని తెలియజేస్తున్నాం...

Visakhapatnam

2020-11-14 15:20:38

IPS&IRPFS లకు హైదరాబదులోనే శిక్షణ..

భారతీయ రైల్వే రక్షణ దళం సర్వీసు (ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్..)కు ఎంపికైన అధికారులకు ఇకపై హైదరాబాద.లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్.వి.పి.ఎన్.పి.ఎ.)లో శిక్షణ ఇవ్వబోతున్నారు. తదుపరి బ్యాచ్ రైల్వే రక్షణ దళం అధికారులకు తొలిదశ శిక్షణను, ఐ.పి.ఎస్. ప్రొబేషనర్లతో సహా అందించబోతున్నారు. ఉభయ సర్వీసుల అధికారులకు ఒకే చోట శిక్షణ ఇవ్వడంవల్ల, వారిని క్షేత్రస్థాయి యూనిట్లలో నియమించినపుడు, ఉభయ సర్వీసుల మధ్య మరింత మెరుగైన సమన్వయం నెలకొనే అవకాశం ఉంటుంది.   ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి.) నియమిస్తుంది. సివిల్ సర్వీసు పరీక్షల నిర్వహణ ద్వారా వారిని ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం 5 లేక ఆరుగురి బ్యాచ్ తో ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. ప్రొబేషనర్ల ఎంపిక జరుగుతుంది. వారికి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా సంస్థ (ఎల్.బి.ఎస్.ఎన్.ఎ.ఎ.)లోను, వడోదరలోని జాతీయ రైల్వే అకాడమీ (ఎన్.ఎ.ఐ.ఆర్.)లోను ఫౌండేషన్ కోర్సులో శిక్షణ కల్పిస్తారు. లక్నోలోని జగ్జీవన్ రామ్ రైల్వే రక్షణ దళం అకాడమీలో కూడా వారికి వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు.   ఇప్పటివరకూ 1998నుంచి 1999వరకూ మొత్తం 3 బ్యాచులకు సంబంధించిన ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులకు ఐ.పి.ఎస్. అధికారులతో కలిపి శిక్షణ అందించారు. అయితే, ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ పద్ధతిని నిలిపివేశారు.   అయితే, ఇదే పద్ధతిని తిరిగి ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు.  రైల్వే మంత్రిత్వశాఖ, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు, చర్చల అనంతరం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులకు కెరీర్ ప్రారంభ శిక్షణను, ఈ ఏడాది శీతాకాలంలో మొదలయ్యే తదుపరి బ్యాచ్ ఐ.పి.ఎస్. ప్రొబేషనర్లతో కలిపి నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణనను మొదలు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.     ఎస్.వి.పి.ఎన్.పి.ఎ.లో శిక్షణ సందర్భంగా ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులకు మరింత సమర్థవంతమైన తర్ఫీదు లభించే అవకాశం ఉంది. దీనివల్ల రైల్వే భద్రతా విధులను వారు మరింత సామర్థ్యంతో, మెరుగైన వృత్తి నైపుణ్యంతో నిర్వహించేందుకు వీలవుతుంది. శిక్షణ అనంతరం ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులను క్షేత్రస్థాయి యూనిట్లలో నియమించినపుడు ఉభయ సర్వీసుల అధికారుల మధ్య మెరుగైన సమన్వయం, సహకారం ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ భద్రతా యంత్రాంగంలో రైల్వే భధ్రతా విభాగానికి నానాటికీ ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో,..రైల్వే భద్రతా దళం వృత్తిపరంగా మరింత సామర్థ్యం, నాయకత్వ పటిమను అలవర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఉద్యోగ ప్రారంభంలోనే ఐ.పి.ఎస్. అధికారులతో పాటుగా శిక్షణ అందించినపుడే  వారికి వృత్తిపరంగా, విధినిర్వహణపరంగా మెరుగైన సామర్థ్యం అలవడుతుంది.

New Delhi

2020-11-14 14:18:36

2020-11-14 13:19:16

ఎమ్మెల్సీ కాబోతున్న గోరటి వెంకన్న..

తెలంగాణలోని ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కెసిఆర్ కేబినెట్ నిర్ణయించింది. ఆ స్థానాలను ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపారు. గవర్నర్ ఆమోదం తెలిపితే పేర్లు పంపిన వారంతా ఎమ్మెల్సీలుగా ప్రమాణాలు స్వీకారం చేయనున్నారు. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉండిపోయాయి. దీంతో సీఎం కేసీఆర్ కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు వినిపించగా.. సీఎం నిర్ణయం మేరకు వీరి పేర్లును ఖరారు చేశారు.దీంతో తెలంగాణలో ప్రముఖ కవి ఎమ్మెల్సీ కాబోతున్నారు..

Hyderabad

2020-11-13 19:19:31

సుజనా ఇదినీకు తగునా..

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది.. బ్యాంకు కుంభకోణం కేసులో సుజనాపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయడం.. ఆపై అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. లుక్‌ అవుట్‌ నోటీసుల ఆధారంగా ఆయనను  ఇమిగ్రేషన్‌ అధికారులు అతన్ని నిలిపివేశారు. మరోవైపు తాజా నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్‌ఔట్‌ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు.  ఇప్పటికే రాజ్యసభ్యులు సుజనా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డారు. వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు కూడా జారీచేసింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్‌ ఇండస్ట్రీస్, సుజనా మెటల్‌ ప్రొడక్ట్, సుజనా టవర్స్‌ లాంటి లిస్టెడ్‌ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్‌టోనిక్స్‌ కూడా లిస్టెడ్‌ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్‌ హోం అప్లయన్సెస్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్‌ అండ్‌ కాంప్ట్రాన్‌) మినహా మిగిలినవన్నీ షెల్‌ కంపెనీలే. ఇవి సర్క్యులర్‌ ట్రేడింగ్, బుక్‌ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా  గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని బ్యాంకు అధికారులు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది..

New Delhi

2020-11-13 17:30:43