నాగులచవితి పర్వదినం సందర్భంగా మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని 18 మంది స్నేక్ రెస్క్యూ టీమ్ ప్రత్యేక సేవలు అందించనున్నట్టు స్నేక్ సేవర్ సొసైటీ అధ్యక్షుడు రొక్కం కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలుపోసే సమయంలో ఎక్కడైనా పాములు కనిపించినా, ఇబ్బందులు ఎదురైనా తమ రెస్క్యూ బ్రుందం సహాయ సహయసహకారాలు అందిస్తుందన్నారు. దానికోసం మహానగర వాసులు 98491 40500 లేదా 8331840500 నెంబర్లలో సంప్రదించాల్సి వుంటుందన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులు, ప్రభుత్వ అధికారులు సద్వినియోగం చేసుకోవాలని స్నేక్ సేవర్ సొసైటీ నిర్వాహకులు కోరారు.