సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి..


Ens Balu
3
Pendurthi
2021-11-08 08:10:41

హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి విశాఖ శారదా పీఠం నిరంతరం కృషి చేస్తుందని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు.' నాగుల చవితి పర్వదినం రోజున జన్మించిన స్వరూపానందేంద్ర కు సోమవారం సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు స్వరూపానందేంద్రను పీఠంలో  కలుసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామీజీని ఘనంగా సత్కరించి సింహాద్రినాధుడు జ్ఞాపికను శ్రీనుబాబు దంపతులు అందజేశారు. ఈసందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సినసమయం ఆసన్న మయ్యిందన్నరు. ఆ విషయము లో విశాఖ శారదా పీఠం ముందువరుసలో ఉంటుందని భరోసా ఇచ్చారు. సింహాచలం దేవస్థానం అభివృద్ధి కి పూర్తి స్థాయిలో కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు.