మెరిట్ జాబితా రేపు ఆన్ లైన్ లో ప్రకటన.. డిఎంహెచ్ఓ


Ens Balu
4
Kakinada
2021-11-23 16:20:45

తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ క్రింద అర్బన్ పీహెచ్సీల్లో నియమించే వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ అభ్యర్ధుల జాబితా రేపు తూర్పుగోదావరి జిల్లా అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.గౌరీశ్వర్రావు తెలియజేశారు. ఈమేరకు మంగళవారం కాకినాడ లో జిల్లా మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అభ్యర్ధులు జాబితా ఆధారంగా ఒరిజిన్ సర్టిఫికేట్లతో నిర్ధేశించిన తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన సూచించారు. ఇందులో స్టాఫ్ నర్సులు 35, మెడికల్ ఆఫీసర్లు 40, ల్యాబ్ టెక్నీషియన్-1, హాస్పటిల్ అటెండెంట్-3, శానటరీ అటెండ్-3, కన్సల్టెంట్ క్వాలిటీ మెంటర్ పోస్టు ఒకటి ఉన్నదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివరించారు.