తహసిల్థార్లు నుండి సమాచారం సేకరించాలి..


Ens Balu
3
Srikakulam
2021-12-04 07:53:06

శ్రీకాకుళం జిల్లాలో  మండలాలకు సంబంధించి తహసిల్థార్లు నుండి పూర్తి స్థాయి సమాచారం సేకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు.  జవాద్ తుఫాన్ కు సంబంధించి మండలాల్లో పరిస్థి ఏ విధంగా ఉన్నదని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీతతో సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, అక్కడ ఎంత మంది ప్రజలు ఉన్నారు, వారికి ఆహారం సరఫరా చేస్తున్నది లేనిది తెలుసుకోవాలన్నారు.  ప్రస్తుత పరిస్థితి మండలాల్లో ఏ విధంగా ఉన్నదీ తెలుసుకోవాలని పేర్కొన్నారు.  వర్షపాతం నమోదు, గాలులు వేగం, తదితర అంశాలపై మండలాల నుండి సమాచారం సేకరించాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో ఆయా విభాగలకు సంబంధించిన పర్యవేక్షకులు, కంట్రోల్ రూరం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.