11 మందికి కారుణ్య నియామకాల్లో పోస్టింగ్లు..


Ens Balu
6
Visakhapatnam
2021-12-06 12:41:47

విశాఖజిల్లాలో వివిధ శాఖలలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలక్టర్ ఈరోజు నియామక పత్రాలను అందజేశారు.  సోమవారం కలెక్టరు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నియామక ఉత్తర్వులను సంబంధిత అభ్యర్ధులకు అందజేశారు.  వీరిలో 5గురికి గ్రామ రెవెన్యూ అధికారులు (వి.ఆర్.ఓ)లుగా మరో 6 గురికి వివిధ శాఖలకు కేటాయించారు. కలెక్టరు కార్యాలయం, సమాచార శాఖ డి.డి. కార్యాలయం,  నర్సీపట్నం ఆర్.డి.వో. కార్యాలయం,  పబ్లిక్ హెల్త్, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు ఒక్కొక్కరిని ఆఫీస్ సబార్డినేట్ లను కేటాయించారు.